టీడీపీ అధికార పార్టీ మీద మిగతా పార్టీలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఒక పక్క వైసీపీ ప్రధాన ప్రతి పక్షంగా జనాల్లో దూసుకుపోతూ టీడిపి ప్రభుత్వం వైఫల్యాలను ఎండ గడుతుంది. ఇక జనసేన పార్టీ అధినేత కూడా పవన్ కళ్యాణ్ చంద్ర బాబు మీద విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. ఇక బీజేపీ కూడా బాబు మీద విమర్శలు కురిపిస్తుంది. అయితే జనసేన, బీజేపీ వైసీపీ పార్టీ ని టార్గెట్ చేయకుండా టీడీపీ పార్టీనే టార్గెట్ చేయడం కొసమెరుపు. 

Image result for chandra babu

ఇంకా పవన్ మాట్లాడుతూ, నవ నిర్మాణ దీక్షల కోసం వేసే పందిళ్ళకి రూ.13 కోట్లు నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి గిరిజన ప్రాంతాల్లో వంతెనలకి డబ్బులు ఇవ్వపోవడాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకో మాట మారుస్తూ ప్రజల్ని పదేపదే మోసం చేస్తున్నారని స్పష్టం చేశారు. ``అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్ళేందుకు మరో అవకాశం కావాలని ముఖ్యమంత్రి అడుగుతున్నారు.

Image result for chandra babu

2014లో మీకు పవన్ కల్యాణ్ జన సైనికులు అండగా ఉన్నారు. 2019లో మీకు ఎవరు ఉంటారు?`` అంటూ బాబు టీం అవాక్కయ్యే ప్రశ్నలు పవన్ సంధించారు. గిరిజనుల్ని ఓట్లుగా చూస్తూ వారి అభివృద్ధిని పాలకులు విస్మరిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతాలు అన్నా ఉత్తరాంధ్ర అన్నా చిన్న చూపు అని పవన్ ఆరోపించారు. ``కనీస అవసరాలు కూడా తీర్చారు. విద్య వైద్యం అడుగుతున్నా వాటిని కూడా తీర్చరు. అని బాబు మీద విరుచుకుపడ్డాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: