చంద్రబాబు లోకేష్ చేస్తున్న అవినీతిని న్యాయస్థానాలలో నిలబెట్టిన అందుకే నాపై కాక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు తనయుడు రాష్ట్రమంత్రి నారా లోకేష్ పనికిమాలిన దద్దమ్మ అని మండిపడ్డారు.
రాజావాసిరెడ్డి ఇచ్చిన భూములను కొట్టేయాలని లోకేష్ ప్రయత్నాలు చేస్తే అడ్డుకున్నానని, దానితో పాటు ఓటుకు నోట్లు కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు ఇప్పించినందుకే తనను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. డీఎస్పీ దుర్గాప్రసాద్ దగ్గరనుంచి అన్యాయంగా భూములు కొన్నానని ఆర్కే దగ్గర కీలక సమాచారం రాబట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని వాటిలో వాస్తవం లేదని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే.
వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు బయటపెడుతున్ననని నాపై బురద చల్లే కార్యక్రమాలు ఇవన్నీ అంటూ చంద్రబాబుపై లోకేష్ పై మండిపడ్డారు. నన్ను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు లోకేష్ చేసిన అవినీతిపై పోరాడుతూనే ఉంటాను అంటూ హెచ్చరించారు ఆర్కే.