భవిష్యత్తును చెడగొట్టకున్న ఫిరాయింపులు
పార్టీ ఫిరాయించటమైతే తమ చేతుల్లో ఉంది కాబట్టి సులభంగా గోడ దూకేశారు. టిడిపిలోకి ఫిరాయించిన తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఎలాగంటే పార్టీ ఫిరాయించినపుడు వాళ్ళందరికీ చంద్రబాబునాయుడు రెడ్ కార్పెట్ పరిచారు. తర్వాత ఎవరినీ పట్టించుకోలేదు. టిడిపి నేతలు కూడా ఫిరాయింపులను దగ్గరకు రానీయటం లేదు. దాంతో వాళ్ళ ముగ్గురి పరిస్ధితి ఎటూ కాకుండా పోయింది.
టిడిపిలో ఇమడలేక తిరిగి వైసిపిలోకి రాలేక నానా అవస్తలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు టిక్కెట్లు వస్తుందో రాదో చెప్పలేకున్నారు. ఎందుకంటే, నియోజకర్గంలో కూడా జనాలు వాళ్లని చీదరించుకుంటున్నారు. ఇటువంటి పరిస్దితుల్లో అనర్హత వేటు పడి తమ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు జరిగితే పరిస్దితి ఏంటనేది వాళ్ళకు అర్ధంకాక ఫిరాయింపుల్లో టెన్షన్ మొదలైంది.