దీంతో భారతీయ జనతాపార్టీ నాయకులు చంద్రబాబు చేస్తున్న అవినీతిని గత నాలుగు సంవత్సరాలుగా భరించి ఇటీవల చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నించి తెలుగుదేశం పార్టీతో జత కట్ చేసుకున్నారు. బీజేపీతో దోస్తీ కట్ అయినా నేపద్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు బిజెపి పార్టీ పై అలాగే మోడీపై తీవ్ర అవినీతి ఆరోపణలు విమర్శలు చేయడానికి తెగబడ్డారు.
ఈ క్రమంలో మంత్రి అఖిలప్రియ మోడీ పై షాకింగ్ కామెంట్స్ చేసారు..మోడీ అత్యాచారాలు చేయమన్నాడని మంత్రి అఖిలప్రియ ఆరోపించడం తీవ్ర వివాదాస్పదం అవగా…చంద్రబాబ నమ్మినబంటు అనే పేరున్న ఏపీ ప్రణాళికసంఘం వైస్ చైర్మన్ కుటుంబరావు మోడీ దిమ్మతిరిగే స్కాంను త్వరలో్ బయటపెడతామని ప్రకటించడం ఈ వివాదాని మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల వైఖరిని బట్టబయలు చేసేందుకు బీజేపీ రంగంలోకి దిగింది.
ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ మేరకు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయాలకు విలువలకు పెద్దపీట వేసే పార్టీ అని డబ్బా కొట్టుకోవడమే తప్ప ఆచరణలో అలాంటి వైఖరి లేదన్నారు. మహిళా మంత్రి అత్యాచారాల గురించి ప్రధానిపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆమెతో పాటుగా కుటుంబరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు గవర్నర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్న భయం నెలకొంది.