ఈ మద్య బీజేపీ నేతలు తమ నోటికి బాగా పనిచెబుతున్నారు. ఎవరి విషయంలోనైనా సరే నోటికి ఏది వస్తే అది  మాట్లాడుతూ.. కొన్ని సార్లు మ్యాన్ హాండిలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  ఆ మద్య ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వారిని బూటుతో మొహం మీద కొట్టండీ అంటూ..వారి కన్నా వేశ్యలే నయం..డబ్బులు తీసుకొని ఆనందాన్ని ఇస్తారు..వీరు డబ్బులు తీసుకొని సతాయిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్.  తాజాగా మరోసారి తాజ్ మహల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మొఘలుల కాలం ముగిసిన తర్వాత కూడా మన దేశంలోని రహదారులకు, చారిత్రక కట్టడాలకు వారి పేర్లు ఉండటం కరెక్టు కాదని అన్నారు. అంతే కాదు తాజ్ మహల్ పేరును  రామ్ మహల్ లేదా కృష్ణ మహల్ గా మార్చాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, మన నేలపై  మొఘలుల కట్టడాలు ఉన్నాయి కనుక వాటిని కూల్చేందుకు వీలు లేదని, అందుకు బదులుగా వాటి పేర్లు మారిస్తే సరిపోతుందని సూచించారు. 
Image result for MLA SURENDAR SINGH
గతంలో తాజ్ మహాన్ ను తేజో మహల్ అనేది అసలు పేరు అని వాదనలు కూడా వినిపించాయి. ఒకవేళ తాజ్ మహల్ పేరును మార్చే అవకాశం తనకు లభిస్తే దాని పేరును ‘రాష్ట్ర భక్తి మహల్’ అని నామకరణం చేస్తానని చెప్పడం గమనార్హం. మన దేశంలో ఉన్న మొఘల్ కట్టడాల్లో ఒక దానికి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెడితే ఆ అనుభూతే వేరని, అద్భుతంగా ఉంటుందని సురేంద్ర సింగ్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: