ప్రస్తుత రాజకీయాలలో ఓటు బ్యాంకు కాపాడుకోవడమంటే మామూలు విషయం కాదు..ఒక ఓటును డబ్బు కులం మతం ఏవిధంగా ప్రభావితం చేస్తుందో మనం ఈరోజుల్లో చూస్తూనే ఉన్నాం. కానీ వీటన్నిటినీ తలదన్ని ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్న దేశంలోనే అతికొద్ది రాజకీయనాయకులలో ఒకరు..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీరాల నియోజకవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్. ప్రస్తుత రాజకీయాలలో ఆమంచి కృష్ణమోహన్ పొలిటికల్ కెరియర్ ని వివాదాల సుడిగుండాలలో పెట్టాలని కొన్ని రాజకీయ శక్తులు చూసినా కానీ చీరాల ప్రజలను ఆమంచి లో ఉన్న మంచితనము నుండి వేరు చేయలేకపోయాయి అని అనటంలో సందేహం లేదు. తాజాగా ఇటీవల ఒక స్కూలు విషయం లో ఆమంచికి సంబంధించి లోకల్ గా పెద్ద చర్చ నడుస్తోంది.
Image result for amanchi krishna mohan
అసలు ఈ స్కూల్ ఏంటి - ప్రభుత్వ స్కూల్ కోసం 1500 మంది అప్లికేషన్ లు ఎందుకు పెడుతున్నారు, వెయ్యి సీట్లు ఉన్న ఒక్క స్కూలు అందునా ఎవ్వరూ కేర్ చెయ్యని ప్రభుత్వ స్కూల్ కోసం పదిహేను వందల మండి అప్లికేషన్ లు పెట్టడం ఏంటి .. ఈ దేశవ్యాప్త రికార్డ్ ని ఒక్కసారి పరీక్షిద్దాం..గత ఎనిమిది సంవత్సరాల నుండి పిల్లలపై చదువు అనే భారం పెట్టి నిలువునా వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూళ్లపై అలాగే విద్యా వ్యవస్థ పై ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టే ప్రయత్నాలు చేశారు ఆమంచి కృష్ణమోహన్ గారు...అంతేకాకుండా ఆ రోజులలో గవర్నమెంట్ స్కూల్లో చదివే చాలామంది ఏ విధంగా అన్ని రంగాలలో రాణించారో కూడా ప్రస్తుత పై ప్రయత్నాన్ని బట్టి తెలియజేశారు.
Related image
మొత్తం మీద ఆ మంచి గారి యొక్క ప్రయత్నం ఏవిధంగా సాగిందంటే " ఆయన లాజిక్ ఒక్కటే .. ప్రజలు కట్టే టాక్స్ ల తోనే స్కూళ్ళు, వైద్యం నడుస్తున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టుకుని ప్రైవేటు స్కూళ్ళ కి ఆసుపత్రుల కీ వెళ్ళాల్సిన ఖర్మ ఏంటి ? ఈ లాజిక్ తోనే ఈ కల నిజం అవడం మొదలైంది " లోకల్ గ్రౌండ్ రిపోర్టర్ చెప్పే మాట ఇది. తాజాగా ఆమంచి కృష్ణమోహన్ గారు చేసిన ఈ ప్రయత్నం లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని డెవెలప్ చేసి హై స్కూల్స్ గా మార్చారు. అలా అలా సాగిన పయనం ఇప్పుడు కొత్త స్కూల్ దగ్గర వరకూ వచ్చింది ..తాజాగా ఇటీవల పిల్లల చదువు విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న ఆమంచి కృష్ణమోహన్ గారు ఎకరంన్నర స్థలం లో రెండున్నర కోట్ల డబ్బు తో ఒక స్కూలు కట్టించారు...ప్రస్తుత రోజుల్లో పేదవాడికి చదువు దూరమవుతున్న నేపద్యంలో ప్రతి పేదవాడు చదువుకోవాలని దృష్టిలో ఉంచుకుని ఈ పాఠశాలను కట్టించారు ఆమంచి గారు..ఎంతో కష్టపడి శ్రద్ధ తీసుకుని రేయింబవళ్లు కృషిచేసి వెయ్యి మందికి స్కూల్లో సీట్లు ఉండేలా ప్లాన్ చేసిన...ఈ పాఠశాలలో పదిహేను వందల మంది అప్లికేషన్ లు పట్టుకుని మాకు ఇవ్వండి సీటు అంటూ తిరుగుతున్నారు.
Related image
గవర్నమెంట్ ఉద్యోగుల దగ్గర నుంచీ పోలీసులు, కలక్టర్, ప్రైవేటు స్కూళ్ళ ప్రిన్సిపాళ్ళ మనవరాళ్ళ అప్లికేషన్ లు కూడా ఈ పదిహేను వందల అప్లికేషన్ లలో ఉన్నాయి అంటే ఎంత వింత?...అంతేకాకుండా తన తదనంతరం పాఠశాల ని టచ్ చేయకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నారు ఆమంచి గారు...ప్రస్తుత రోజులలో కేవలం విద్య అంటే ఉదయం ఎన్ని గంటల నుండి ఒక పాతిక కేజీల బియ్యం బస్తా మోసే స్టూడెంట్ చదువుల కాక….భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని చదువు ఒక వ్యాపారంలా కాకుండా నైతిక విలువలతో కూడిన విద్యను అందించడానికి ఎంతో కృషి చేసి ఈ పాఠశాలను కట్టించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు. ఆమంచి దెబ్బ అలా ఇలా ఉండదు .. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి టీడీపీ కి చుక్కలు చూపించాడు 2014 లో .. చంద్రబాబు ని స్వయంగా కాళ్ళ బేరానికి రప్పించుకుని టీడీపీ లో జేరారు. అనేక తలనొప్పులు, వివాదాలు సృష్టించి టీడీపీ తన ప్రాంత అభివృద్ధి ని అడ్డం పడుతోంది అని అర్ధం చేసుకున్న ఆమంచి తప్పనిసరి పరిస్థితి లో జనం కోసం టీడీపీ కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు.
Image result for amanchi krishna mohan
టీడీపీ లో ఒక్కొక్క నాయకుడికీ ఇప్పటికీ ఆమంచి అంటే కాస్తంత భయమే. హానెస్ట్ పర్సన్ అనే ఫీలింగ్ లోనే కథ మొత్తం సాగుతుంది. అయితే ఈ స్కూల్ విషయం లో కూడా క్రెడిట్ కాజేయ్యడం కోసం టీడీపీ విపరీతంగా కష్టపడింది . ఈ స్కూల్ కోసం అహర్నిసలూ కష్టపడిన ఆమంచి కి పేరు దక్కకుండా రీసెంట్ గా పచ్చ మీడియా పేపర్లలో స్కూల్ నీ గవర్నమెంట్ నీ పన్లేక వచ్చి ఓపెన్ చెయ్యడానికి హడావిడి చేసిన నారా లోకేష్ నీ ఆకాశానికి ఎత్తేసే హడావిడి చేసింది టీడీపీ . సొంత పచ్చ మీడియా పేపర్ లలో రాసుకుంది అలాగే ఉంది. ఆమంచి కి క్రెడిట్ దక్కకుండా చేస్తోంది. చివరికి ఈ స్కూల్ అడ్మిషన్ ల లెక్క చూసి బాబుకి సైతం చెమటలు పట్టాయి అంటే ఆమంచి హడావిడి అర్ధం చేసుకోవచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే ల పైన కూడా బాబు కడుపు మంట కి ఆమంచి నిలువెత్తు నిదర్శనం !


మరింత సమాచారం తెలుసుకోండి: