ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు చెప్పి మోసపూరితమైన వాగ్దానాలు చేసి నిండా రాష్ట్ర ప్రజలను యువకులను ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబుకి రాబోయే ఎన్నికలలో గట్టిగానే బుద్ధి చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇదిలావుండగా తాజాగా జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర లో తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర లో కాపులు ఎక్కువ సంఖ్య లో కనపడడం టీడీపీలో కొంత భయం పట్టుకుంది.
గత ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు కాపులే కారణమనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం జగన్ వెంట కాపులు అడుగులు వేస్తున్నట్లు ఈ యాత్ర తో అందరికి అర్ధం అవుతుంది. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీకి ప్రచారం చేయుట వల్ల కూడా ఎక్కువ శాతం కాపు ఓటింగ్ టీడీపీ కి మళ్లింది. అలాగే గోదారి ఒడ్డున… కడపకు మించిన ఆదరణ వస్తుండటంతో టీడీపీలో కలవరం మొదలయింది.
అంతేకాదు జ్యోతుల నెహ్రు సైతం వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. అయితే గత ఎన్నికలలో కాపులను బీసీల్లో చేరుస్తాను అని చెప్పి తీవ్రంగా మోసం చేసిన చంద్రబాబు పై కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎంతగానో ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రాన్ని ప్రజలను కాపాడగలిగే నాయకుడు జగన్ అంటూ కాపు ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు.