వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీతో ఈనాడు బీజేపీ పార్టీతో కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబు పై ఆయన చేస్తున్న అవినీతిపై మరో పుస్తకాన్ని ముద్రిస్తున్నామని.. దాన్ని దేశంలోని అన్ని పార్టీలకు అందజేస్తామన్నారు.
చంద్రబాబు అవినీతి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తాను పీసీసీ చీఫ్గా చేసినప్పుడు చంద్రబాబు ముసుగేసుకుని వచ్చి చాలా మందిని రహస్యంగా కలిశారని బొత్స చెప్పారు. టీడీపీ తీరు మారకుంటే సమయం వచ్చినప్పుడు అవన్ని బయటపెడుతానని వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబుపై కేసు పెడితే రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తామని టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. నేను సరిగ్గా నోరు విప్పితే ఆనాడు జరిగిన పరిణామాలపై... రాష్ట్రంలో ఎక్కడ కూడా చంద్రబాబు తన మొహాన్ని చూపించలేరు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బొత్స సత్యనారాయణ. దీంతో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఏపీ టిడిపి నాయకులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారు.