‘ ప్రతి ఒక్కరి విషయాలు నాకు తెలుసు.. అధికారం వచ్చినప్పటి నుంచీ అవినీతి, కబ్జాలు, వసూళ్లు అధికమయ్యాయని మండిపడ్డారు. ఎన్టీఆర్ గృహ కల్పనలో మంజూరైన ఇళ్లకు డబ్బులు తీసుకుంటారా..? పెన్షన్లకు డబ్బులు తీసుకుంటారా..? ఎక్కడ చూసినా కబ్జాలు చేస్తున్నది మీరే.. ఇదేమి కుప్పం... పరిస్థితి ఇలా తయారైంది ’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
‘రోడ్డు విస్తరణలో రెండో రీచ్ పనులు దౌర్జన్యంగా చేస్తారా..? అధికారుల వద్ద చేయించాలే తప్ప మీరే బహిరంగంగా దిగి ప్రజలను ఇబ్బందిపెడితే ఎలా ? ’ అంటూ నేతలపై కేకలు వేశారు.
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీ బంధు మిత్రుల కోసం ఇంటి వారి కోసం ఖర్చు చేస్తారా అంటూ కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం నాయకుల పై మండిపడ్డారు లోకేష్. ప్రతి ఒక్కరి జాతకం నాకు తెలుసు అని ఇలానే చేసుకుంటూ పోతే తగిన సమయంలో అందరి విషయాలు బయట పెట్టి బొక్కలో పెడతామని హెచ్చరించారట నారా లోకేష్..!