వైఎస్ బొమ్మను పార్టీ లోగోగా వాడకుండా వైసీపీ జనంలోకి వెళ్ళాలంట. ఇదీ కాంగ్రెస్ నాయకుల తాజా సవాల్. రాహుల్ గాంధీ డైరక్షన్ తో వైసీపీపై యాక్షన్ కి విశాఖ కాంగ్రెస్ లీడర్లు దిగిపోయారు.  వైఎస్సార్ తో వైసీపీకి ఏంటి సంబంధం అంటూ  సిటీ కాంగ్రెస్ యూత్ లీడర్ ఒకరు వైసీపీపై ఓ రేంజిలో ఫైర్ అయిపోయారు. జగన్ ఆయన కొడుకు మాత్రమే, ఆస్తులకు వారసుడు కావచ్చు, ఆశయాలకు అసలైన వారసులు కాంగ్రెస్ నాయకులేనని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

Related image

నవరత్నాలు కాంగ్రెస్ వేనట !
వైసీపీ ప్రకటించిన నవ రత్నాలు కాంగ్రెస్ వేనంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. వైఎస్ కాంగ్రెస్ సీయం. ఆయన అమలు చేసిన పధకాలు అన్నీ కాంగ్రెస్ ఆలోచనలే. వాటిని కాంగ్రెస్ ఆమోదించి వైఎస్ ద్వారా ఏపీ ప్రజలకు అందించింది. అందులోనుంచే మళ్ళీ నవరత్నాలు పేరు చెబుతూ వైసీపీ జనాలను కన్ ఫ్యూజ్ చేస్తోంది అంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 


వైఎస్ పేరు చెప్పకుండా గెలవాలంట !
కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ ని వైసీపీ ఎలా సొంతం చేసుకుంటుందని ధర్మ సందేహం వ్యక్తం చేస్తున్నారు ఖద్దరు నాయకులు. వైఎస్ పేరు చెప్పకుండా జగన్ జనంలోకి వెళ్ళి గెలవాలని కూడా చాలెంజ్ చేస్తున్నారు. అపుడు కూడా జనం ఓట్లు వేస్తే జగన్ లీడర్ అని ఒప్పుకుంటారుట.
Image result for ys jagan
కాంగ్రెస్ సోది చెబుతోంది !
వైఎస్సార్  తో జగన్ కి సంబంధం లేదంటూ కాంగ్రెస్ నేతలు సోది చెబుతున్నారంటూ వైసీపీ లీడర్లు గుస్సా అయ్యారు. వైఎస్ చనిపోయాక వదిలేసింది ఎవరని వారు ప్రశ్నించారు. ఒకపుడు కాంగ్రెస్ లో వైఎస్ పేరే వద్దంటూ చెప్పిన ఈ నోళ్ళే ఎన్నికల వేళ నాలుగు ఓట్ల కోసం ఆయన జపం చేస్తున్నాయని వైసీపీ నాయకులు ఫైర్ అయ్యారు. జగన్ జన నేతని, అది ఏనాడో ప్రూఫ్ అయిందని, కొత్త పూజారిలా కాంగ్రెస్ వచ్చి నీతులు చెబితే వినే వాళ్ళు ఎవరూ లేరని గట్టి కౌంటర్లు ఇచ్చారు.  ఇలా . టీడీపీని వదిలేసి వైసీపీపై కాంగ్రెస్ ఇలా విరుచుకుపడడమే అసలైన పాలిట్రిక్స్


మరింత సమాచారం తెలుసుకోండి: