ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రకాశం జిల్లా జగన్ కు బాబాయ్ వరస అయ్యే వైవీ సుబ్బారెడ్డి పేరు ఇలాంటి రచ్చ విషయంలో వినిపిస్తూ ఉండటం విశేషం. ఈ విషయంలో జగన్ కూడా సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇటీవల వైవీ సుబ్బారెడ్డికి జగన్ క్లాస్ పీకడం కూడా జరిగిందని సమాచారం. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో వైవీ సుబ్బారెడ్డి తనకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న విషయం ప్రస్తుతం పార్టీలో అనేక మంటలు రగిలిస్తూ నేపద్యంలో జగన్ వెంటనే వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయినట్టుగా తెలుస్తోంది.
తనకు నచ్చిన వారికి అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ, తనకు నచ్చని వారికి నెగిటివ్ రిపోర్టులు ఇస్తున్నారట వైవీ. ఈ వ్యవహారంపై జగన్ కు కూడా ఆగ్రహం వచ్చిందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా ఏ కాకుండా పశ్చిమగోదావరి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థుల ఎంపిక వ్యవహారాల్లో కూడా వైవీ సుబ్బారెడ్డి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు తేలడంతో జగన్ ఈసారి గట్టిగానే క్లాస్ తీసుకున్నారట.
గత ఎన్నికలలో కొద్దిపాటి శాతంతో అధికారం కోల్పోయిన జగన్ ఈసారి పూర్వం జరిగిన తప్పులు జరగకుండా ఎక్కడికక్కడ సమస్యలని పరిష్కరిస్తూ పార్టీ నాయకులను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు జగన్. మొత్తంమీద చూసుకుంటే వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ చాలా కరాఖండిగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతుంది.