ఇటీవల  ముఖ్యమంత్రి చంద్రబాబు  గారు పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరులో పర్యటించారు.  ఈ సందర్భంగా చంద్రబాబు  పలు ప్రభుత్వ అభివృద్ధి   కార్యక్రమాలను  ప్రారంభించారు.  గత ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీ  అధికారంలోకి రావడానికి  రాష్ట్రం అభివృద్ధి చెందడానికి  పశ్చిమగోదావరి జిల్లా  ముఖ్య పాత్ర పోషించిందని  పేర్కొన్నారు. 
Image result for chandrababu
2014 ఎన్నికలలో  పార్లమెంటు శాసనసభ స్థానాలు మొత్తం తెలుగుదేశం పార్టీ  గెలిచిందని ఈ సందర్భంగా  చంద్రబాబు అన్నారు. అన్యాయంగా విభజనకు గురైన ఆంధ్రరాష్ట్రాన్నిఅభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందని ఆనాడు మీరు ఇచ్చిన తీర్పు నా జీవితంలో మర్చిపోలేనని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. 
Image result for chandrababu
దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పశ్చిమగోదావరి జిల్లా వాసులు మండిపడ్డారు. అన్ని స్థానాల్లో గెలిపించిన ఈ జిల్లాకు ఒక ప్రయోజనకరమైన పని కూడా చంద్రబాబు కల్పించలేదని విమర్శించారు...జిల్లాకు ఎప్పుడొచ్చినా అన్ని స్థానాలు గెలిపించిన జిల్లా మీ జిల్లా అని చెప్పి ప్రకటనలు చేసి వెళ్లి పోవడం తప్ప పనులలో అసలు విషయం అభివృద్ధి కనిపించటంలేదని సంచలన కరమైన కామెంట్లు చేశారు పశ్చిమగోదావరి జిల్లా వాసులు.
Image result for chandrababu
గత ఎన్నికలలో అనవసరంగా చంద్రబాబుకు ఓటు వేసి మా రాష్ట్రాన్ని మా జిల్లాని మోసం చేసుకున్నామని బాధపడ్డారు...అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా ఓటు ద్వారా బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా అన్నారు పశ్చిమ వాసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: