కత్తి మహేష్ ఇప్పడు ఎవరీ నోటా విన్న ఈ పేరే  కోపం తో రగిలిపోతున్నారు. మొదట పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసిన కత్తి మహేష్  అందరికీ పాపులర్ అయిపోయాడు. అయితే కత్తి మహేష్ మాటల్లో విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఏదైనా విషయాన్ని ఎంతో స్పష్టంగా మాట్లాడగలడు. అయితే కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పడు అతన్ని కష్టాల పాలు చేస్తుంది. అయితే కత్తి మహేష్ తాజాగా వైసీపీ తరుపున పోటీ చేస్తానని ప్రకటించాడు. 

Image result for kathi mahesh

అంతేకాదు తాను వైఎస్ జ‌గ‌న్‌ను త్వర‌లో క‌లుస్తాన‌ని కూడా చెప్పారు. శ్రీ‌రాముడిపై క‌త్తి మ‌హేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న‌కు అపాయింట్‌మెంట్ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు స‌ర్వత్రా వ్యక్తమ‌వుతున్నాయి. జ‌గ‌న్‌ను క‌లిసేందుకు క‌త్తి మ‌హేశ్‌కు అపాయింట్‌మెంట్ ఇప్పించి కొత్త స‌మ‌స్యను కొని తెచ్చుకోవ‌డం ఎందుక‌నే అభిప్రాయంలో వైసీపీ శ్రేణులు ఉన్నట్టు తెలుస్తోంది. టీటీడీ వివాదం నేప‌థ్యంలో ఆ ఆల‌య మాజీ ప్రధాన అర్చకులు ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు.

Image result for jagan

క్రిస్టియ‌న్ అయిన జ‌గ‌న్‌ను ర‌మ‌ణ‌దీక్షితులు ఎలా క‌లుస్తార‌ని సీఎం చంద్రబాబు స‌హా జ‌గ‌న్ ప్రత్యర్థులు ఆరోప‌ణ‌లు గుప్పించి వివాదాస్పదం చేసిన విష‌యం తెలిసిందే. బీజేపీతో క‌ల‌సి జ‌గ‌న్‌, ప‌వ‌న్‌లు హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బతీస్తున్నార‌నే సెంట్‌మెంట్ రేకెత్తించేందుకు టీడీపీ ర‌మ‌ణ‌దీక్షితుల క‌ల‌యిక‌ను వాడుకొంది. ఇప్పుడు జ‌గ‌న్‌ను క‌త్తి మ‌హేశ్ క‌లిస్తే తిరిగి అవే ఆరోపణ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: