పంచాయితీ రాజ్, ఐటి శాఖ మంత్రి, చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్ భ‌లే కామిడీ చేస్తున్నారు. తాను గ‌డ‌చిన 36 గంట‌లుగా పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌టంలోను, అవ‌గాహ‌నా ఒప్పందాల‌ను కుదుర్చుకోవ‌టంలోనూ చాలా బిజీగా ఉన్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇంత‌కీ ట్విట్ట‌ర్ గోలేంట‌నుకుంటున్నారా ? ఈ మ‌ధ్య చిన్న‌బాబు త‌న ఆలోచ‌న‌ల‌ను, చెప్ప‌ద‌లుచుకున్న‌దంతా ట్విట్ట‌ర్ ద్వారానే ప్ర‌పంచానికి తెలియ‌జేస్తున్నార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందేగా ?  బ‌హిరంగ స‌భ‌ల్లోనో లేక‌పోతే మీడియా స‌మావేశాల్లోనో మాట్లాడుతుంటే జ‌నాల‌కు అడ్డ‌దిడ్డంగా దొరికిపోతున్నారు. అందుక‌ని ట్విట్ట‌ర్ ను వేదిక‌గా చేసుకున్నారు. ఇక్క‌డైతే వ‌న్ వే ట్రాఫిక్కే క‌దా ?


పెట్టుబ‌డులు, ఎంవోయుల‌తో బిజీన‌ట‌


ఇంత‌కి విష‌యం ఏమిటంటే ?  కేంద్ర‌మంత్రుల ద‌గ్గ‌ర‌కు బ్రోక‌ర్ల‌ను పంప‌వ‌ద్ద‌ని చంద్ర‌బాబు, లోకేష్ ల‌కు ఒక కేంద్ర‌మంత్రి హెచ్చ‌రించిన‌ట్లుగా బిజెపి జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ స‌భ్యుడు జివిఎల్ న‌ర‌సింహారావు ఈమ‌ధ్య ఆరోపించారు. దానికి లోకేష్  జ‌వాబు చెబుతూ తాను పంపిన బ్రోక‌ర్ల పేర్లను  చెప్పాలంటూ నిల‌దీశారు. జివిఎల్ నుండి ఇంకా స‌మాధానం రాలేదు. ఆ విష‌యాన్నే లోకేష్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌శ్నించారు. అదే సంద‌ర్భంలో తాను గ‌డ‌చిన 36 గంట‌లుగా బిజీగా ఉన్న‌ట్లు కూడా చెప్పారు. ఎందుక‌య్యా అంటే పెట్టుబ‌డులు, అవ‌గాహ‌నా ఒప్పందాల‌తోన‌ట‌. 


భ్ర‌మ‌ల్లో ముంచ‌ట‌మే టిడిపి అల‌వాటు

Related image

జివిఎల్ ఎందుకు స్పందించ‌లేద‌న్న‌ది ప‌క్క‌న‌పెడితే, లోకేష్ చెప్పిన పెట్టుబ‌డులు,అవ‌గాహ‌నా ఒప్పందాల విష‌యం న‌మ్మ‌ద‌గ్గ‌దేనా ? ఎందుకంటే, ఎంత‌చిన్న విష‌యాన్నైనా బూత‌ద్దంలో చూపించ‌టం టిడిపికి బాగా అల‌వాటు. జ‌ర‌గ‌బోతుంది అనుకున్న‌దాన్ని కూడా జ‌రుగుతున్న‌ట్లుగాను, జ‌ర‌గ‌నిదాన్ని కూడా జ‌రిగిపోతోంద‌ని న‌మ్మించ‌టం టిడిపికి వెన్న‌తో పెట్టిన విద్య‌. అటువంటిది 36 గంట‌లుగా లోకేష్ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌టమే కాకుండా అవ‌గాహ‌నా ఒప్పందాల‌తో బిజిగా ఉంటే మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తున్న‌ట్లు ? అదే నిజ‌మైతే  టిడిపికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డే మీడియాలో ఈపాటికే ఊద‌రగొట్టేయాలి క‌దా ? ఎక్క‌డా క‌నీసం సింగిల్ కాల‌మ్ వార్త కూడా రాలేదే ? అంటే ట్విట్ట‌ర్ ఖాతాలో కూడా లోకేష్ త‌న మార్కు కామిడిని కంటిన్యూ చేస్తున్నార‌న్న విష‌యం అర్ధ‌మైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: