దీంతో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై తీవ్రంగా ప్రతిస్పందించారు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి. రాజకీయాలలో అనుభవం ఉండి శాసనసభ్యుడిగా రెండుసార్లు మంత్రిగా ఒకసారి పని చేశాను అని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాజకీయాలలో ప్రతిపక్షంలో అధికార పక్షంలో రెండింటిలో ఉన్నాను కానీ ఇప్పటివరకు నాపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు నా పొలిటికల్ కెరియర్ లో ఎవరు చేయలేదు.
ఈ నేపద్యంలో పవన్...నేను వందల కోట్లను వసూలు చేస్తున్నట్లు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. పవన్ రాజకీయాల్లో కొత్త, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించడం కాదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లను పంపుతాను.. వాటిలో ఉన్న దానికి కంటే ఒక్కరూపాయి ఎక్కువగా ఉన్నా తాను ఎలా శిక్షను అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
తాను అవినీతి పాల్పడ్డానని ఆరోపిస్తున్న కమిటీ వేయమని అంటున్న పవన్ ..ఏ అధికారంతో కమిటీని వేయమని అడుగుతున్నారని ప్రశ్నించారు...ఇష్టమొచ్చినట్లుగా నాయకులపై ప్రజాప్రతినిధులపై కామెంట్లు ఆరోపణలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోయే వారికి వారు చేసే ఆరోపణలకు ఎటువంటి అర్థాలు ఉండవని ఇవన్నీ రాజకీయ లబ్దికోసమే చేస్తున్నారని పేర్కొన్నారు.