విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే ఓ గురువు..కామంతో కళ్లు ముసుకొని ప్రవర్తించాడు.  ఇది తప్పు అని చెప్పాల్సిన విద్యార్థులతో కలిసి ఓ బాలికపై అత్యాచారానికి వడికట్టాడు.  గత కొంత కాలంగా మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలు రోజు రోజుకు  పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై  పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా 18 మంది అత్యాచారం చేశారు. ఈ దారుణం గత ఎనిమిది నెలల నుంచి జరుగుతోందట.

భరించలేని బాలిక తల్లితో చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువులకు మాత్రమే ఇస్తారు..కానీ  గురువులపై నమ్మకం కోల్పోయేలా చేసిన ఈ ఘటన బీహార్‌లోని సరన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..2017 డిసెంబర్‌లో ఆమెతో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బాలికపై పాఠశాల మరుగుదొడ్డిలో గ్యాంగ్‌రేప్‌ చేశారు. దాన్ని వీడియో తీసిన నిందితులు తోటి విద్యార్థులకు  పంపించారు.  దాంతో ఆ విద్యార్థులు సైతం ఆ బాలికను బెదిరించి తమ కామవాంఛ తీర్చుకుంటూ వస్తున్నారు. 

ఇది కాస్త పాఠశాల ప్రిన్సిపాల్‌కు, ఉపాధ్యాయులకు తెలిసింది. వారు కూడా బాధితురాలిని భయపెట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా తమ  ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ బాలికపై దారుణానికి పాల్పడుతున్న సమయంలో బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన ఆమె తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. బాధితురాలు తెలిపిన 18 మందిపై మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: