పవన్ కళ్యాణ్ విమర్శలు కు టీడీపీ కి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. పవన్ కళ్యాణ్ మాటల తూటాలు బాబు కు మరియు అతని కొడుకు అయినా లోకేష్ కు సూటిగా దిగుతున్నాయి. అయితే మొన్నటివరకు జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతుంటే ఇప్పడూ పవన్ కళ్యాణ్ దాడి ఎక్కువైందని టీడీపీ లో చర్చలు మొదలయినాయి. అయితే పవన్ కళ్యాణ్ లోకేష్ మీద చేసిన విమర్శలు కు టీడీపీ దగ్గర సమాధానమే లేదు.
చంద్రబాబు, లోకేష్లతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి పిల్లలు, అనుచరులు ఇసుక, భూకుంభకోణాలకు పాల్పడుతూ ప్రకృతిని దోచేస్తున్నారని ప్రకృతి ప్రేమికుడైన పవన్ విరుచుకుపడుతున్నారు. ఇలాగైతే డాల్పిన్ కొండలు కూడా భవిష్యత్లో మిగిలవని విమర్శల తీవ్రతను పెంచారు. లోకేష్ను దొడ్డిదారిన మంత్రి చేశారని, దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలిపితే తన సత్తా ఏమిటో నిరూపిస్తానననే సవాల్తో అబ్బాకొడుకులపై పవన్ బౌన్సర్ విసిరారు.
ఈ సవాల్కు ఏమని జవాబు చెప్పాలో తండ్రికొడుకులు జుట్టుపీక్కోవడమే తక్కువైంది. విశాఖ రైల్వేజోన్ కోసం బాబు, లోకేష్, జగన్ రాజీనామా చేసి వస్తే నలుగురూ కలసి దీక్ష చేస్తామని, అందుకు సిద్ధమా అని వారిపై యార్కర్ విసిరారు. ఇంతకాలం తన జట్టు సభ్యుడనే భావిస్తూ వచ్చిన పవన్ నేడు ప్రత్యర్థిగా మారి జెట్ స్పీడ్తో బౌలింగ్, బ్యాటింగ్ చేస్తుంటే కెప్టెన్, వైస్ కెప్టెన్లగా వ్యవహరిస్తున్న తండ్రీకొడుకులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.