మోత్కు పల్లి నరసింహులు టీడీపీ తెలంగాణ సీనియర్ నేత. అయితే చంద్ర బాబు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ కు గురైనాడు. అయితే మోత్కుపల్లి పార్టీ నుంచి బయటికి వచ్చిన తరువాత తన నోటికి ఇంకా పని చెప్పడం మొదలపెట్టాడు. చంద్ర బాబు మీద ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఇప్పడూ కూడా విమర్శలు సంధిస్తున్నారు. అయితే ఆయన ఏపీవ్యాప్తంగా యాత్ర చేపడతానని, చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేయొద్దని ప్రజలకు విన్నవిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు తిరుపతికి బయల్దేరారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి వెళ్తారని, అక్కడ శ్రీవారి దర్శనం అనంతరం ఆయన కార్యచరణను వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే, తిరుపతి పర్యటనతోనే ఆయన టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. స్వామి వారి దర్శనమనంతరం, వారం రోజుల పాటు ఏపీలోనే మకాం వేసి ఎక్కడినుంచి యాత్ర మొదలు పెట్టలన్న దానిపై ఓ రూట్ మ్యాప్ సిద్దం చేయనున్నట్లు తెలుస్తుంది.
అయితే, టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలపైనే ఆయన ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం. మాజీ సీఎం నందమూరి తారకరామారావు చేతుల్లోంచి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా చంద్రబాబు లాక్కున్నారు, అసలు వెన్నుపోటు వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, పార్టీలో టికెట్ల కొనుగోళ్లు ఏ విధంగా జరుపుతున్నారు, ఒక్కో రాజ్యసభ సీటును ఎంతకు అమ్ముకున్నాడు, పార్టీనే నమ్ముకున్న తనలాంటి వారిని ఏ విధంగా మోసం చేశాడు ఇలా అనేక విషయాలను మోత్కుపల్లి తన యాత్రలో పూస గుచ్చినట్లు ప్రజలకు చెప్పబోతున్నట్లు సమాచారం.