ఆయన అసలు పేరు జేసీ, కొసరు పేరు పేచీ. ఏ మాట మాట్లాడినా మడతేయకుండా ఉండలేరు. మనసులో.  ఏ మాత్రం దాచుకోకుండా ఉన్నదున్నట్లుగా తిట్టేస్తారు. పంచ్ డైలాగులను  సొంత పార్టీకీ పంచి పెడతారు. అదే ఆయన గారి స్పెషాలిటీ మరి.  అందుకే ఆయన మైకు పట్టుకుంటే స్వపక్షానికే వణుకు. మొన్న కడపలో, నిన్న విశాఖలో నేడు అనంతపురంలో వేదిక ఏదైనా జేసీ సెటైర్లు సైకిల్ తమ్ముళ్ళకూ  తప్పడం లేదు.


మాటలతో షాకులే : 


కడప వెళ్ళిన జేసీ స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలెందుకు చేస్తున్నారు, బుద్ది లేకపోతే సరి అంటూ షాక్ ఇచ్చారు. విశాఖలో రైల్వే దీక్షకు వచ్చినా అవే కామెంట్స్. జోన్ ఇవ్వరంటే ఇవ్వరు. ఏదో బాబు బాధ పడలేక ఇలా రోడ్డు మీదకు వచ్చామని కుండ బద్దలు కొట్టారు. ఇపుడు అనంతపురం వంతు వచ్చింది. మోడీ ప్రధానిగా ఉన్నంతవరకూ ఏపీకి చిన్న బెల్లం ముక్క కూడా ఇవ్వడంటే ఇవ్వడంటూ జేసీ అనేసరికి ఎంపీ తమ్ముళ్ళు మరో మారు అవాక్కవాల్సివచ్చింది. పైపెచ్చు ఇదే ముక్క తాను చంద్రబాబుకూ చెప్పానని, అయినా ఏదో జనం కోసం దీక్షలు చేస్తున్నామన్నట్లుగా ఏదేదో మాట్లాడేశారు.


అదే వంటి పేరేమో :


వివాదాలే జేసీ వంటి పేరేమో. నిన్నటికి నిన్న అనంతపురంలో ఓ మీటింగులో మాట్లాడుతూ నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు, ఒకవేళ ఇచ్చినా నన్ను తట్టుకోలేడు అంటూ భారీ స్టట్మెంట్ ఇచ్చేశారు. అంతేనా  టీడీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వెధవలు అంటూ డామేజింగ్ గా మాట్లాడారు. బాబు పధకాలన్ని శుద్ద దండుగ, అయితే సీఎంకి చెప్పే ధైర్యం మంత్రులకు లేదన్నారు. మాటలో మాటగా కమ్యూనిస్టులనూ దొంగలనేశారు. వామ్మో ఈ జేసీ నోటికి అడ్డూ అదుపూ లేదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: