చంద్ర బాబు నాయుడు 2014 మానిఫెస్టోలో కూడా ఈ అన్న క్యాంటీన్లు హామీ కూడా ప్రముఖమైనది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంటే ఇప్పటికి గుర్తొచ్చింది. అయితే అన్న క్యాంటీన్లు వెనుక పెద్ద స్కామ్ ఉందని తెలుస్తుంది. ప్లేటుకు 5 రూపాయల అని చెప్పి కాంట్రాక్టర్స్ కు ప్లేట్ కు 73 రూపాయల చొప్పున ఇస్తున్నారంట.. ఆ కాంట్రాకర్స్ ఎవరో కాదు స్వయంగా టీడీపీ మంత్రి . ఈ విధంగా టీడీపీ ప్రతి దానిలో అవినీతి వెతుకోవ్వడం అలవాటు అయిపోయింది. 

Image result for anna canteens

మొదట్లోనే ఇస్కాన్, స్వచ్ఛంద సంస్థలు వస్తే అన్నారు కానీ.. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల వ్యవహారం రెండు వందల కోట్ల రూపాయల పై మొత్తానికి చేరింది. ఒక్కో క్యాంటీన్ ఏర్పాటు, నిర్వాహణకు కోటి రూపాయల మొత్తంవరకూ ఖర్చు పెడుతున్నారట. కోటిరూపాయల డబ్బే ఉంటే స్టార్ హోటల్ మెయింటెయిన్ చేయవచ్చు. అయితే ఐదురూపాయల అన్నం పెట్టడానికి ఇంత మొత్తాన్ని వెచ్చించడం చంద్రబాబు సర్కారుకే సాధ్యం అవుతోంది.

Image result for anna canteens

ఇదంతా దోపిడీ పర్వమే అని, అన్నాక్యాంటీన్ల వ్యవహారం అంతా దోపిడీనే అని, వీటి నిర్మాణం, నిర్వహాణ అంతా స్కామే అనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అంటూ కాంట్రాక్టర్ కు మాత్రం ప్లేటుకు 73రూపాయల మొత్తాన్ని దోచి పెట్టడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ కాంట్రాక్టు వ్యవహారాలు ఎక్కడిక్కడ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అయిన వారికే కట్టబడుతున్నారని... తద్వారా కమిషన్ల వ్యవహారం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: