బీజేపీ నాయకులూ ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇపుడూ ఈ నాయకులూ కామెడీ కూడా బాగానే చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పడూ కానీ బీజేపీ ఎన్నికల్లో భరీ లోకి దిగితే ఒక్క సీటు కూడా రాదన్నది వారికి తెలుసు. అయితే బీజేపీ కేంద్ర మంత్రి జగన్ బీజేపీ తో కలిస్తే జగన్ ను సీఎం చేస్తాం అని చెప్పడం తో అందరూ నవ్వుకుంటున్నారు. బీజేపీ కే గతి లేదు వీరు జగన్ ను సీఎం చేస్తారంటా..!
స్థూలంగా పరిశీలిస్తే... రాందాస్ అథవాలే భాజపా నాయకుడు కాదు. మరో చిన్నా చితకా పార్టీ వ్యక్తి. ఆయనేమీ భాజపా విధాన నిర్ణేత కాదు. అయినా సరే.. ఆయన ఎన్డీయేలోకి వైఎస్సార్ కాంగ్రెస్ రావడం గురించి, భాజపా పూనుకుని ఆయనను సీఎం చేసేయడం గురించి తన తాహతుకు మించి అతిశయం అనదగిన డైలాగులు వల్లిస్తున్నారు. తమాషా ఏంటంటే అలాంటి ఊరూపేరూ లేని నాయకుడ మాటలను పట్టుకుని.. తెలుగుదేశం వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టడానికి పూనుకుంటోంది.
కేంద్రమంత్రి రాందాస్ అథవాలే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తూ హైదరాబాదులో ఓ కార్యక్రమంలో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అథవాలే మాటలు కొత్త విషయం ఏమాత్రం కాదు. ఈ ఏప్రిల్లో విజయవాడలో కూడా ఆయన ఇలాంటి మాటలే మాట్లాడారు. చంద్రబాబు వెళ్లిపోయాడు గనుక.. జగన్ వచ్చి ఎన్డీయేలో చేరితే బాగుంటుందని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని అప్పట్లో అన్నారు.