రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన బిజెపి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇతర నాయకుల పై తీవ్రమైన అభాండాలు వేస్తున్నారు. ఈ క్రమంలో 2014 ఎన్నికలలో చంద్రబాబుతో చేతులు కలిపి కేంద్రంలో భారీ మెజారిటీ తో అధికారంలోకి వచ్చి చంద్రబాబుని ఆయన నమ్ముకున్న ప్రజలను వెన్నుపోటు పొడిచిన బిజెపి చంద్రబాబు పై దారుణమైన లేనిపోని విమర్శలు చేయడానికి సిద్ధమైనట్లు వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. ఇంతకి విషయం ఏమిటంటే ఇటీవల బిజెపి నాయకులు చంద్రబాబుపై చాలా దారుణమైన కామెంట్ చేశారు...అబద్దాలు పదే పదే చెప్తే నిజాలు అవుతాయని నమ్మించడంలో చంద్రబాబు ఆరి తేరారని బీజేపీ నేతలు విమర్సలు చేస్తున్నారు.

Image result for bjp

ఇక ఈ నేపథ్యంలో ఆధారాలతో సహా బాబు అవినీతిని బయటపెడుతున్నా ఎలాగోలాగ మేనేజ్ చేస్తూ వస్తున్నారనే ఆరోపణలు చేశారు బీజేపీ నేతలు . అయితే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వస్తున్నారని కమలనాధులు గుర్తు చేశారు . అయితే రాష్ట్రనికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న సీసీ రోడ్లు , నీరు , 24 గంటల కరెంటు, టాయిలెట్స్ , పేదలకు ఇల్లు ఇలా అన్నింటిపై ప్రజల్లో అవగాహన కలిపించాలని గట్కరి బీజేపీ నేతలకు సూచించారట.

Image result for tdp bjp

దీంతో ఈ విమర్శలపై మండిపడ్డారు టిడిపి నాయకులు...రాష్ట్రాన్ని అడ్డంగా మోసం చేసి చట్టపరంగా రావాల్సిన విభజన హామీలను తుంగలోతొక్కి చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టాలని దక్షిణాదిలో మతరాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా చేసుకోవాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాలు నిజం కావా అన్ని ప్రశ్నించారు.

Image result for chandrababu

రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు అని దానికి నిదర్శనమే…. ఆయన కష్ట ఫలితమే ఇటీవల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రానికి దేశంలోనే మొట్ట మొదటి స్థానం వచ్చిందని పేర్కొన్నారు. బిజెపి పెద్దలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్న క్రమంలో దాని ఓర్వలేకే  ఢిల్లీ బిజెపి పెద్దలు రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులతో చంద్రబాబు పై లేనిపోని అభాండాలు వేస్తున్నారని సంచలన కామెంట్ చేశారు టిడిపి నాయకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: