మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ ఇటీవల తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లాలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ రైతులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో అనేక వివాదాలకు కేంద్రమైంది. ఇంతటి శ్రీరామ ఏమన్నాడంటే..‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు.

Image result for paritala sri ram

దీంతో పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు రైతులను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం వల్లే అనంతపురం జిల్లాలో ఆడపిల్లలకు ఆ పరిస్థితి వచ్చిందని కామెంట్ చేశారు. మరికొంతమంది 2014 ఎన్నికలలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నిలువునా మోసం చేశారని చంద్రబాబు పై  మండిపడ్డారు...

Image result for paritala sri ram

అంతేకాకుండా పరిటాల శ్రీరామ్ ఏదైనా వ్యవసాయం గురించి ప్రశ్నించాలంటే ముందుగా చంద్రబాబుని ప్రశ్నించాలని సూచించారు నెటిజన్లు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ వైసిపి కి చెందిన రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Image result for paritala sri ram

రైతుల మనోభాలను పరిటాల కుటుంబం దెబ్బతీస్తోందన్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వల్ల అనంతపురంలో ఉన్న రైతులు ఇతర రాష్ట్రాలకు కూలిపనులకు వెళుతున్నారని బాధపడ్డారు. రైతుల గురించి గాని వ్యవసాయం గురించి గాని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ప్రశ్నించే అర్హత లేదని అన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: