అమరావతి పేరిట అద్భుత రాజధాని కడతానని చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు నిజానికి అక్కడ చేస్తున్నది రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాంది. ఉత్తరాంధ్ర టూర్లో భాగంగా విశాఖలో పర్యటిస్తున్న చాందీ బాబు సర్కార్ పై విరుచుకుపడ్డారు. అబద్దాలు ఆడుతూ రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకున్నారని, ఆ భూములలో ఇంతవరకూ  ఎటువంటి నిర్మాణాలూ జరగలేదని చాందీ అన్నారు.


రైతులను బలి పెట్టారు :


పెద్ద ఎత్తున భూములు తీసుకున్న బాబు ప్రభుత్వం రైతులకు సరైన ప్యాకేజ్ ని కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. అప్పన్నంగా భూములను టీడీపీ లాగేసుకుని రైతుల ఉసురు పోసుకుందని హాట్ కామెంట్స్ చేశారు. బాబుకు రైతుల పట్ల ఉన్న చిత్త శుధ్ధి ఇదేనని, ఆయన చెప్పేదొకటి, చేసేది ఒకటి అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ మాత్రం ఎల్లపుడూ రైతులకు అండగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు.


జోడీ దోపిడి :


మోడీ, బాబూ జోడీ అంటూ వచ్చి బాగానె దోపిడి చేస్తున్నారని చాందీ బీజేపీ, టీడీపీలపై  అటాక్ చేశారు. వీరిద్దరి పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే కాంగ్రెస్ కి శ్రీరామ రక్ష అవుతుందన్నారు.  వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని, రాహుల్ ప్రధాని అయ్యాక చేసే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీదనేనన్నారు చాందీ. మోడీపై అవిశ్వాసం పెట్టిన ఘనత కాంగ్రెస్ దేనని, తాము మద్దతు ఇవ్వకపోతే టీడీపీకి ఎంపీల బలం ఎక్కడిదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: