విమర్శల్లో హుందాతనం చాలా అవసరం. అందులోనూ రాజకీయాల్లో ఉన్న వారు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చాలా అనర్ధాలను ఎదుర్కోవాల్సోస్తుంది. పార్టీలు ఏవైనా, సందర్భం ఏదైనా కావచ్చు. హుందాతనాన్ని వదిలేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే జనాలు అసహ్యించుకోవటం ఖాయం. ఇదంతా ఎందుకంటే, తాజాగా వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఈరోజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
చంద్రబాబు ఫోర్త్ జెండర్
ఢిల్లీ పార్లమెంటు ఆవరణలో మీడియాతో విజయసాయి మాట్లాడుతూ, చంద్రబాబును ఫోర్త్ జెండర్ అంటూ సంబోధించారు. విజయాసాయి ప్రకారం ఫోర్త జెండర్ అంటే ఆడ, మగ, నపుంసక కాని మరో జీవట. ప్రకృతి కార్యంలో కూడా డ్యుయల్ రోల్ ప్లే చేసే వ్యక్తి గా చంద్రబాబును మాట్లాడారు. మొదటి మూడు జెండర్లు తెలుసు కానీ ఫోర్త్ జెండర్ ఏంటో అర్ధం కావటం లేదు. ఫోర్త్ జెండర్ అన్న పదం సరిగ్గా అర్దమైనా కాకపోయినా అదేదో విపరీతమైన వ్యాఖ్యలు అని మాత్రం అందరికీ అర్దమైపోతోంది.
అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టారో ?
చంద్రబాబు ఫోర్త్ జెండర్ గా ఉంటూ ఏపి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపించారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మార్చుకుంటున్నట్లు మండిపడ్డారు. ఒకవైపు బిజెపితో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే మరోవైపు కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంటూ మండిపడ్డారు. తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు ఏంటి ఉపయోగమని ప్రశ్నించిన చంద్రబాబు ఇపుడే ఉపయోగం ఆశించి తీర్మానం ప్రవేశపెట్టారని నిలదీశారు. మొత్తానికి విజయసాయి మాటలు కఠువుగా ఉన్నప్పటికీ లేవనెత్తిన ప్రశ్నల్లో మాత్రం తప్పేమీ లేదు.