ప్రధాని నరేంద్ర  మోడీ సర్కార్ పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 325 ఓట్లు, అనుకూలంగా 126 ఓట్లు పడ్డాయి. మొత్తం 451 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం వీగిపోయిందని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. దాదాపు పన్నెండు గంటల పాటు అవిశ్వాసంపై సభలో చర్చ సాగింది. మోడీ గంటన్నరకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేసి విపక్షాలకు ధీటైన జవాబు ఇచ్చారు.   ప్రధానంగా కాంగ్రెస్ ని అటాక్ చేస్తూ మోడీ స్పీచ్ మొత్తం సాగింది.


మోడీ అద్భుత నటుడన్న కేశినేని :


మోడీ ప్రసంగం తరువాత మాట్లాడిన టీడీపీ ఎంపీ కేశినేని నాని మోడీ అద్భుత నటుడంటూ సెటైర్లు వేశారు. హోదా కోసం అవిశ్వాసం పెడితే మోడీ తమకు బ్లాక్ బస్టర్ బాలివుడ్ మూవీ చూపించారని వెటకారం చేసారు. మోడీ కంటే ప్రపంచంలో గొప్పగా నటించే వారే లేరన్నారు. 2014లో అబద్దలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సభలోనూ అబద్దాలే చెప్పారని కౌంటర్లేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: