తెలుగు దేశం ప్రభుత్వం కేంద్రం లో ఉన్న బీజేపీ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతీ తెలిసిందే. అయితే ఈ తీర్మానం వీగిపోతుందని తెలిసిన మోదీ మీద టీడీపీ ఈ తీర్మానం పెట్టింది. అందరు అనుకున్నట్టు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే టీడీపీ సర్కార్ మీద మోదీ సంచలన వ్యాఖ్యలు చేసినాడు. ఇప్పటివరకు నోరు విప్పని మోదీ  ఇప్పడు మొదటి సారిగా చంద్ర బాబు మీద మరియు టీడీపీ మీద ఆవేదన వ్యక్తం చేసినాడు. 

Image result for modi speech\

ప్యాకేజీకి ఓకే చెప్పి ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం యూ టర్న్ తీసుకున్నారంటూ విమర్శించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... " తల్లిని చంపి బిడ్డను బయటకు తీసింది కాంగ్రెస్ పార్టీ... ఇంతకుముందు చెప్పా.. ఇప్పుడు కూడా అదే చెపుతున్నాను. పంపకాల వివాదం సాగుతోంది. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా మార్చాము.ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి వున్నాం. ప్యాకేజీ మంచిదని తెదేపా నాయకుడు ఒకరు చెప్పారు. ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పని చేశారు.

Image result for modi speech\

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు చేశాం. ఎన్డీఏ నుంచి తెదేపా తప్పుకున్నప్పుడు మీరు వైసీపిలో చిక్కుకున్నారని బాబుకు ఫోన్ చేసి చెప్పాను. ఎన్డీఏ ఆంధ్రప్రజల కళ్యాణానికి కట్టుబడి వుంది. అసలు వివాదం ఏపీలో వుంటే సభలో పోరాడుతున్నారు. ఓటుకు నోటు సంగతి మర్చిపోతారు. నన్ను ప్రధానిగా కూర్చోబెట్టేది 125 కోట్ల మంది ప్రజలు, విపక్ష పార్టీలు కాదు. ఒక్క మోదీని దించేందుకు ప్రయాస పడుతున్నారు. మేం అధికార పక్షంలో వున్నాం. ఈ అవిశ్వాన్ని అందరూ తిరస్కరించాలి అంటూ చెప్పారు. అయితే నరేంద్ర మోడీ ఇలా వ్యహాత్మకంగా ఓటుకు నోటు ప్రస్తావించడం కల కలం రేపుతోంది. నరేంద్ర మోదీ బాబు ను అంత ఈజీగా వదిలిపెట్టడని మాత్రం అర్ధం అవుతుంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: