ఈ అవిశ్వాసం తనపై కాదని, కాంగ్రెస్ తనవెంట ఎంతమంది మిత్రులున్నారో తెలుసుకునేందుకే అని మోడీ అనడం వెనుక లోతైన అర్థందాగి ఉంది. టీడీపీని కాంగ్రెస్ మిత్రపక్ష జాబితాలో చేర్చడంలో బీజేపీ విజయవంతమైంది. కాంగ్రెస్ మునిగిపోతోందని, దానివెంట ఉన్నవాళ్లు కూడా మునిగిపోతారని ప్రధాని పరోక్షంగా టీడీపీని హెచ్చరించారు. కేసీఆర్ మంచి పాలనాదక్షుడని, తెలంగాణ అభివృద్ధిలో ముందుందని చెబుతూ చంద్రబాబు ఏమీచేయడం లేదని పరోక్షంగా విమర్శించారు.
తీరా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. మోడీ అన్నట్టు కాంగ్రెస్, టీడీపీ కూటమికి కేవలం 126మంది మద్దతున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా మోడీని మరింత బలోపేతం చేసినట్టైంది. అవిశ్వాసం తీర్మానం ద్వారా తాము ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్టు మైలేజ్ సంపాదించుకోవాలని ఎత్తుగడను మోడీ చిత్తుచేశారు. అంతేనా ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నైతికతను దెబ్బతీసేలా మాట్లాడారు.