వైఎస్ఆర్సిపి పార్టీ ఫైర్ బ్రాండ్ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన రోజా అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రత్యర్థుల పార్టీల రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది అని కామెంట్లు చేశారు.

Image result for chandrababu

మా నాయకుడు జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో పాదయాత్ర చూసి పాలకవర్గానికి మతి పోతుంది అని పేర్కొన్నారు. 2014 ఎన్నికలలో చంద్రబాబు సుమారు ఆరువంద‌ల‌కు పైగా త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించి అధికారంలోకి వ‌చ్చార‌ని అయితే 2019 ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వెయ్యి హామీల‌ను ప్ర‌క‌టించినా టీడీపీని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని రోజా స్ప‌ష్టం చేశారు.

Image result for chandrababu roja

రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ భూమి క‌మిటీ పేరుతో ప్ర‌జా ధ‌నాన్ని అక్ర‌మంగా దోచుకుంటున్నార‌ని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కదా అని చంద్రబాబు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్ని రోజులు ఒకలాగా ఉండవని రోజా అన్నారు.

Related image

పార్లమెంటు సాక్షిగా ఆంధ్రరాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజల హక్కులను చంద్రబాబు కాలరాశారని పేర్కొన్నారు...ఇందుమూలంగానే జగన్ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పిల్లవాడు దగ్గర నుండి పెద్దవారి వరకు చంద్రబాబు అంతా అబద్ధాలు చెప్పే రాజకీయనాయకుడు మరొకరు లేరని అంటున్నారు అని అన్నారు రోజా.




మరింత సమాచారం తెలుసుకోండి: