ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం`అన్న` క్యాంటీన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అంతకు రెండు నెలల ముందే  వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి మంగళగిరిలో `రాజన్న క్యాంటీన్లు` ప్రారంభించారు. `రాజన్న` క్యాంటీన్ లో ప్రతి ఒక్కరికి రూ.4 రూపాయలకే పూర్తి భోజనం అందించే బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. తాజాగా  వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గంలో త్వరలోనే 'వైయస్సార్ అన్న' పేరుతో క్యాంటీన్లను సొంతంగా ఏర్పాటు చేస్తానని చెప్పారు.
Image result for ysr anna canteens
 ఇప్పటి వరకు అధికార పార్టీ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. అందుకే, ప్రజల కోసం తానే సొంతంగా సహాయ కార్యక్రమాలను చేపడుతున్నానని చెప్పారు.  ఆకలితో అలమటించే వారి కడుపు నింపాలనే సదుద్దేశ్యంతో ఆ క్యాంటీన్లను తాను సొంతంగా ఏర్పాటు చేయబోతున్నానని రోజా తెలిపారు. గతంలో కూడా నగరి ప్రభుత్వాస్పత్రిలో - హాస్టళ్ళలో - బాలికల జూనియర్ కాలేజీలో ఆర్ వో ప్లాంట్లు - కూలర్లు ఏర్పాటు చేశానని అన్నారు.

దాంతోపాటు 10 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు కూడా అందచేశానని అన్నారు. రాజన్న క్యాంటీన్ లో వారం పొడువునా అన్నం - కూర - పప్పు - చిప్స్ అందిస్తారు. నాలుగు రోజుల పాటు గుడ్డు ఇస్తారు .... మిగతా మూడు రోజులు గుడ్డు బదులు...అరటి పండు ఇస్తారు. నిరుపేదలు కూడా మూడు పూటలా కడుపు నిండా నాణ్యమైన భోజనం చేయాలనే సేవా దృక్పథంతో ఈ క్యాంటీన్ ప్రారంభించామని ఆర్కే గతంలో చెప్పారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరి నియోజకవర్గ రూపురేఖలే మారిపోతాయని చెప్పారు. రాజన్న క్యాంటీన్ కు ప్రజలనుంచి విపరీతమైన ఆదరణ వస్తోందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: