మీరు చదువుకున్న వారు, ఉన్నత విద్యా శాఖామాత్యులు, అన్ని తెలిలి ఇలా అబద్దాలు ఆడతారా అంటూ మంత్రి గంటాపై బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమర్ రాజు ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే విశాఖలో ఐ ఎం ఎం జాతీయ విద్యా సంస్థకు ఇంత వరకూ పునాది రాయి తప్ప ఒక్క ఇటుక కూడా లేపలేదని ఈ మధ్యనే మంత్రి గంటా ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీని ఓ దులుపు దులిపేశారు. విభజన హామీలు చేశామంటున్నారు.  జాతీయ  సంస్థలకే దిక్కు లేదంటూ విరుచుకుపడ్డారు.


అక్కడ నుంచే కౌంటర్ :


దీనికి టిట్ ఫర్ టాట్ అన్నట్లు బీజేపీ రాజు గారు ఏకంగా విశాఖ మీడియాను ఐ ఎం ఎం స్థలం వద్దకే తీసుకెళ్ళి మరీ అక్కడ జరుగుతున్న పనులను చూపించారు. అంతటితో ఆగకుండా మంత్రి గంటాపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. అసలు మాకు మీ ప్రభుత్వం స్థలం ఇచ్చిందే ఈ ఏడాది మార్చిలో అయితే ఒక్క ఇటుక పడలేదని ఎలా చెబుతారు మంత్రి గారూ  అంటూ గుస్సా అయ్యారు. స్థలం ఇచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా బిల్డింగ్ దిజైన్లను వేయించామని, 56 కోట్ల రూపాయలు కూడా కేంద్రం విడుదల చేసిందని చిట్టా పద్దులు బయటకు తీసారు.


మీకు ఆ హక్కు లేదు :


ఐ ఎం ఎం గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటూ రాజు గారు టీడేపీ మంత్రులకు  కచ్చితంగా చెప్పేశారు. మంజూరు చేసింది మేము, నిధులు ఇచ్చింది మేము, రేపటి రోజున కట్టించి ఇచ్చేదీ మేము, మీరెందుకు మాట్లాడుతున్నరంటూ ఫైర్ అయ్యారు. క్రెడిట్లూ, డెబిట్లూ ఏమైనా మావేనంటూ గంటాకు షాక్ ఇచ్చేశారు. ఏదేమైనా ఈ మధ్యన బీజేపీ లీడర్లు గమ్మున ఉండడం లేదు. ఎన్నికల మాజిక్కో. మరేంటో కానీ లాజిక్కులు తీసి మరీ తమ్ముళ్ళ నోళ్ళు మూయిస్తున్నారు. ఈ మాటల అటాక్ ఆగేలా లేదు స్పీడ్ చూస్తుంటే.
 


మరింత సమాచారం తెలుసుకోండి: