జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో తన పార్టీని బలపరచుకోవాలని ప్రజా పోరాట యాత్ర అని రాష్ట్రమంతా పర్యటించడానికి సిద్ధపడిన విషయం మనకందరికీ తెలిసినదే. ముందుగా ప్రజాపోరాట యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Image may contain: 1 person, beard

2014 ఎన్నికల సమయంలో మార్చి నెలలో ప్రారంభించిన జనసేన పార్టీని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఎన్నికల బరిలో దింపి పోటీ చేసిన సందర్భాలు లేవు. కేవలం తన ప్రసంగాలతో తనకి ఉన్న క్రేజ్తో రాజకీయాలలో ప్రధాన రాజకీయ పార్టీలకు మద్దతు తెలుపుతూ కీలకమైన విషయాలలో సరికొత్త పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో జనసేన పార్టీ మూడో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎన్నికలలో నిలుస్తుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Image result for mp kothapalli geetha

ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల పవన్ జగన్ ల మధ్య వివాదం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. ఈ నేపథ్యంలో ఒక్కపుడు వైసీపీ పార్టీ లో అరకు MP కొత్తపల్లి గీత కూడా జగన్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి తన మద్దతు అంటూ ట్విటర్ లో ఆమె పెట్టిన ట్వీట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Image may contain: 9 people, people smiling, people standing and outdoor

ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కొత్త పల్లి గీత 2019 లో ఒక్కవేల వేరే పార్టీ లో చేరడానికి మొగ్గు చూపితే అది జనసేన పార్టీ లో మాత్రమే అని ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నారు..ఒక్క వేల ఆలా జరిగితే జనసేన కి మరో బలమైన అభ్యర్థి దొరికినట్టే చెప్పొచ్చు. అయితే మరోపక్క పార్టీ ఫిరాయించే రాజకీయ నాయకులను నేను సపోర్ట్ చేయను అని గతంలో చెప్పిన పవన్ కొత్తపల్లి గీత విషయంలో ఏం చేస్తారో అనా ఆసక్తి రాష్ట్రంలో ఉన్న అందరి రాజకీయ నేతల్లో నెలకొంది.




మరింత సమాచారం తెలుసుకోండి: