జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తో దూసుకు పోతున్నాడు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఒక ప్రభంజనం లా సాగిపోతున్నాడు. సినిమా వాళ్లకు వచ్చినట్లు వస్తున్నా ఆ జనాల హోరు ఇసుక వేస్తే రాలనంత అని చెప్పవచ్చు. పోయిన ఎన్నికలో కొద్దీ పాటి తేడాతో జగన్ కి అధికారం దూరం అయ్యింది. ఈ సారి ఎలాగైనా అధికారం లోకి రావాలన్న కసితో జగన్ ముందుకు సాగి పోతున్నాడు. అయితే జగన్ మానియా చాలా మంది నాయకులను పార్టీ మారే ఆలోచనలోకి నెట్టుతుంది. 

Image result for jagan

తాజాగా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాటికే ఆయన వైసీపీని పలుమార్లు సంప్రదించి రాయబారాలు పంపారు. ఒకట్రెండు దశలు చర్చలు కూడా జరిగాయట. టీడీపీలో ఉంటే మాజీలుగా మిగిలిపోవడం తప్ప భవిష్యత్తు శూన్యం అని భావించిన చాలా మంది మేడా బాట పడుతున్నారు. జగన్ ఎవరినీ పిలవరు... అందుకే ఆకర్షితులు అయిన వారే స్వయంగా వచ్చి అడిగితే తప్ప జగన్ కలవరు. ఎందుకంటే... జంపింగ్ లతో పార్టీ నిలబడదనేది జగన్ నమ్మకం.

Image result for jagan

అయితే పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించని తెలుగుదేశం నేతలు చివరి నిమిషంలో రంగంలోకి దిగారు. మేడా అసంతృప్తికి కారణాలు ఆరా తీసి... ఆయన కోరికలన్నీ తీరుస్తాం పార్టీ వీడొద్దని వినతులు పంపుతున్నారట. టీడీపీ పెద్దల జోక్యం  హామీలతో ఆయన పార్టీ మారే ఆలోచన విరమించుకున్నారు. మేడా వెనక్కి తగ్గడంతో టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అయన ఎపుడైనా పార్టీ మారొచ్చనీ ఆతని వర్గాల నుంచి వినిపిస్తున్న మాటలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: