చంద్ర బాబు ముద్దుల తనయుడు లోకేష్ సభలో ఏం మాట్లాడి పార్టీ పరువు తీస్తాడని లోలోపల టీడీపీ నాయకులూ మథన పడుతుంటారు. తాను ఏం మాట్లాడిన కామెడీ మాత్రం గారంటీ అని తెలుగు ప్రజలు ఫిక్స్ అయి పోతారు. ఇప్పడూ కూడా లోకేష్ కామెడీ ప్రజలకు కిక్కేస్తుంది. నాపై ఇలాగే ఆరోపణలు చేస్తే.. ఏపీకి పెట్టుబడులే రావ్..’ అనేశాడు నారాలోకేష్ బాబు. ఈ మాటతో ప్రతి పక్షాలకు ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు. ఇది లోకేష్ కే  సాధ్యమైన కామెడీ అనుకోని గమ్మునయిపోయారు. 

Image result for lokesh

తనపై అవినీతి ఆరోపణలకూ, రాష్ట్రానికి పెట్టుబడులకు భలే ముడిపెట్టేశాడు లోకేష్ బాబు. రాష్ట్ర శ్రేయస్సును కోరుకున్న వాళ్లెవ్వరూ లోకేష్ ను ఏమీ అనకూడదని ఆయనే చెప్పుకున్నాడు. చివరగా లోకేష్ తన ప్రసంగంతో నవ్వులు పండించింది ఒంగోలులో జరిగిన ధర్మపోరాట దీక్షలో కావొచ్చు. అలాగే ఆ మధ్య అసెంబ్లీలో మాట్లాడుతూ...  ఏపీకి ఐటీ కంపెనీలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని, ఆఖరికి ఆ కంపెనీలకు ప్లేస్ కూడా ఇవ్వలేకపోతున్నామని, ఖాళీ ప్లేసంటూ లేకుండా పోయిందని, అంతలా కంపెనీలు వస్తున్నాయని లోకేష్ సెలవిచ్చాడు.

Image result for lokesh

ఆ తర్వాత ఇప్పుడు లోకేష్ నోటి నుంచి జాలువారిన ఆణిమత్యం ‘నాపై ఆరోపణలు చేశారో.. రాష్ట్రానికే పెట్టుబడులు రావ్..’ అనేది. ఇలా ప్రకటించుకునే ‘గొప్పదనం’, ‘మేధస్సు’ చంద్రబాబు నాయుడు తనయుడికే దక్కుతోంది.  కాబట్టి ఇక నుంచి ప్రతిపక్షాల వాళ్లు కామ్ అయిపోవాలి. ఎవ్వరూ లోకేష్ ను ఏమీ అనకూడదు. అలా అంటే.. రాష్ట్రం గతి అథోగతే. చంద్రబాబు తనయుడా మజాకా!


మరింత సమాచారం తెలుసుకోండి: