ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు సెటైర్లు వేస్తూ..చివరికి వారి పర్సనల్ లైఫ్ లోకి కూడా ఎంట్రీ అవుతున్నారు. మొన్నటి మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ తూ.గో.జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కార్లు మార్చినట్లుగా భార్యలను మారుస్తారు..ఆయన నిత్య పెళ్లికొడుకు..ఓ వ్యక్తిత్వం అంటూ లేని మనిషి అని ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని ఎద్దేవా చేశారు. దానికి కౌంటర్ గా పవన్ కళ్యాన్ తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చానని..లక్ష కోట్లు దొంగ డబ్బుతో రాలేదని..పదిహేను నెలలు జైళ్లో చిప్పకూడు తిన్న వారు కూడా నితినియమాలు మాట్లాడుతారని అన్నారు.
ఇలా ఏపి రాజకీయాల్లో ప్రతిరోజూ ఎదో ఒక సెన్సెషన్ అవుతూనే ఉంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దొంగబ్బాయి జగన్ తన పేరును ‘జగన్ మోదీ రెడ్డి’గా మార్చుకుంటే బాగుంటుందని సెటైర్ విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో ‘గ్రామదర్శిని’ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ‘యువనేస్తం’తో నిరుద్యోగులను ఆదుకోబోతున్నామని చెప్పారు. సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని అన్నారు. కాగా, వేలివెన్నులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి లోకేశ్ తెలుసుకున్నారు.
ఎన్టీఆర్ స్మారక సొసైటీ గోదాంను ఆయన ప్రారంభించారు. ఈ మద్య పవన్ కళ్యాన్ కూడా తనపై తన పార్టీపై ఎన్నో ఆరోపనలు చేస్తున్నారని..అవన్నీ నిరూపించే ప్రయత్నం మాత్రం చేయడం లేదని..నిరూపించే సత్తా కూడా లేదని అన్నారు. బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో 175 సీట్లు టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 25 పార్లమెంట్ సీట్లలోనూ టీడీపీని గెలిపిస్తే దేశ ప్రధానిని మనమే నిర్ణయిస్తామని, ఏపీకి ప్రత్యేకహోదా సాధిస్తామని అన్నారు.