ఆంధ్రప్రదేశ్ లో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు తెలియకుండా జరగదంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వీధి దీపాలు వెలగకపోతే తన డ్యాష్ బోర్డ్ లో తెలుస్తుందని చెబుతున్న హైటెక్ సీఎం బాబుకు అక్రమ మైనింగ్ గురించి ఎందుకు తెలియదంటూ నిప్పులు చెరిగారు. తప్పులు చేస్తున్న టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారని మండిపడ్డారు.


ఆ మంత్రి నిద్దరోతున్నారా :


ఏపీలో ఎక్కడ చూసినా అక్రమంగా మైనింగ్ జరుగుతోందని, ప్రభుత్వం చేతగానితనమే ఇందుకు బాధ్యత వహించాలని పవన్ అన్నారు. గనులు ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు తవ్వుకుపోతుంటే సంబంధిత మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇంట్లో నిద్దరపోతున్నారా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడుతూంటే పట్టించుకోవాల్సిన సీఎం చోద్యం చూస్తున్నారని పవన్ విమర్శించారు.


ప్రమాద స్థలానికి పవన్ :


అక్రమ క్వారీ పేలుళ్ళు జరిగిన హత్తిబెళగళ్ ప్రాంతాన్ని ఈ రోజు పవన్ సందర్శించారు. అక్కడ పరిస్థితులను ఆయన స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను రక్షించలేని పాలకులు అధికారంలో ఉన్నారంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆసుపత్రికి వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: