దివంగత వై.ఎస్ శిష్యుడు మాజీ కాంగ్రెస్ నేత మాజీ రాజమహేంద్రవరం ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ మీద మరొకసారి తన ప్రేమను కనపరిచాడు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విడదీసిన నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి మనకందరికీ తెలిసినదే. అయితే అడపాదడపా మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో పెద్దపెద్ద సమస్యలపై తన అభిప్రాయాలు చెబుతూ ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వస్తున్నారు.
ఈ క్రమంలో వైఎస్ జగన్ కి పరోక్షంగా మద్దతు తెలుపుతూ తెలివిగా రాజకీయాలలో రాణిస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇదిలావుండగా తాజాగా ఓ టీవీ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మీద సంచలన కామెంట్లు చేశారు ఉండవల్లి. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే, తనకు తెలిసిన వారే మంత్రులుగా ఉంటారని, ఏదైనా పని చేయించుకోవాల్సి వస్తే, వారి వద్దకు డైరెక్టుగా వెళ్లే అవకాశం లభిస్తుందని, అదే ఇంకోసారి చంద్రబాబు వస్తే, రహస్యంగా మంత్రులతో మాట్లాడి పని చేయించుకోవాల్సి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేసారు.
అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయితే, ఆయనకూ తాను క్రిటిక్ గా మారే అవకాశాలు రావచ్చని చెప్పారు. ఈ క్రమంలో గతంలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ నే కలవడం గురించి వివరంగా ఇచ్చారు.
ఇటీవల తాను చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిశానని అన్నారు. ఆయన పిలిస్తేనే తాను వెళ్లానని, చంద్రబాబు అపాయింట్ మెంట్ ను తాను కోరలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ ను కూడా ఆయన పిలిస్తేనే వెళ్లి కలిసొచ్చానే తప్ప తనంతట తానుగా వెళ్లలేదని తెలియజేశారు. పవన్ కల్యాణ్ పిలవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.