ఎప్పుడైతే బీజేపీ మరియు టీడీపీ మైత్రి విడిపోయిందో అప్పటి నుంచి టీడీపీ మీద బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుంది. ముఖ్యంగా టీడీపీ రాజ్య సభ సభ్యుడు  జీవీఎల్ టీడీపీ కి కొరకరాని కొయ్య గా తయారయ్యాడు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌య‌స‌భ నిర్మిస్తున్నారా అని జీవీఎల్ కామెంట్ చేసి వివాదాస్పద‌మ‌య్యారు. నాటి నుంచి మొద‌లైన ఆయ‌న మాట‌లదాడి, ప్రత్యర్థుల ప్రతిదాడుల మ‌ధ్య జీవీఎల్ పేరు మార్మోగుతోంది.

Image result for bjp leader gvl

ఇటీవ‌ల చంద్రబాబు ప్రభుత్వంపై ప‌ర్సన‌ల్ డిపాజిట్స్ పీడీ అకౌంట్లు, డ‌బ్బు ఖ‌ర్చులో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. అంతేకాదండోయ్‌... యూపీఏ హ‌యాంలో కేంద్రంలో 2జీ కుంభ‌కోణం కంటే పెద్ద కుంభ‌కోణం చంద్రబాబు స‌ర్కార్‌లో జ‌రిగింద‌ని, రాష్ర్టంలో ప‌ర్సన‌ల్ డిపాజిట్స్ పీడీ కుంభ‌కోణం అతి పెద్దద‌ని అవినీతి ఆటంబాబు వేశారు. అధికారుల ప‌ర్సన‌ల్ ఖాతాల్లోకి రూ.55వేల కోట్లు పంప‌డం ఏంటి? అని ప్రశ్న వేసి భారీ అవినీతికి పాల్పడ్డార‌నే విమ‌ర్శలతో టీడీపీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు.

Image result for bjp leader gvl

లాలూప్రసాద్ యాద‌వ్ కంటే మ‌రింత కిందికి దిగ‌జారార‌ని టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ‌రావును షేర్ మార్కెట్ బ్రోక‌ర్ అని తీవ్ర ప‌ద‌జాలంతో దూషించారు.ఇదిలా ర‌చ్చ కొన‌సాగుతుండ‌గా ఢిల్లీలో రైల్‌భ‌వ‌న్‌లో రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయ‌ల్ ఎదుట టీడీపీ ఎంపీలు, రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ జీవీఎల్  ప‌ర‌స్పరం నువ్వెంత అంటే నువ్వెంత అని స‌వాల్ విసురుకున్నారు. నిన్ను ఆంధ్రాలో తిర‌గ‌నివ్వమ‌ని టీడీపీ నేత‌లు హెచ్చరించ‌గా, తేల్చుకుందాం రండి, ఏం చేస్తారో చూద్దాం అని అంతే తీవ్రస్థాయిలో జీవీఎల్ కౌంట‌ర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: