ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒకటే హాట్ టాపిక్ అని చెప్పాలి కాపు సామజిక వర్గం ఎవరి వైపు నిలబడుతుందని 2014 ఎన్నికల్లో కాపు వర్గం టీడీపీ కి అండగా నిలిచింది జగన్ కు అధికారం దూరం చేసింది . రెండు గోదావరి జిల్లాలో జగన్ కు భారీ దెబ్బ తగిలింది. దీనితో అతనికి అధికారం దూరం అయ్యింది అయితే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో భరిలోకి దిగ బోతున్నాడు. మరీ కాపులు పవన్ కు ఓట్లు వేస్తారా..!
పు ఓట్లు జనసేనకే గుండుగుత్తగా పడతాయన్న గ్యారెంటీ లేదనేది కొందరు కాపు నేతల వాదన. ఇప్పటికే కాపు నేతలు వివిధ పార్టీల వారిగా చీలిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్న నేతలు ఆ పార్టీ వాదననే వినిపిస్తారు కాబట్టి సామాజికవర్గాల్లో వారికి మద్దతుగా నిలబడే చోటా మోటా నేతలు కూడా వారికే మద్దతుగా నిలబడుతారట. దాంతో పాటు ఆయా సామిజికవర్గం ఓట్లు వేయించుకునేందుకు వారికే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లలో చీలక తప్పదని అంచనా వేస్తున్నారు.
పవన్ బహిరంగ సభకు జనాలు ఎంతలా వస్తున్నా పిఆర్పీ అనుభవాన్ని నెమరేసుకుంటున్న జనాలు కూడా అంతే స్ధాయిలో ఉన్నారు. 2009లో కాపు సామాజికవర్గం నేతలు కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. అప్పట్లో కాపుల కోసమే చిరంజీవి పిఆర్పి స్ధాపించారంటూ పొలోమంటూ కాపునేతలందరూ పిఆర్పీలో చేరిపోయారు. తీరు చూస్తే జరిగిందేమిటి ? 294 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే గెలిచింది 16 సీట్లు. పైగా సొంత జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలోనే చిరంజీవి ఓడిపోయారు. చిరజీవికన్నా పవన్ గొప్పోడేమీ కాదు కదా ? అంటూ కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. మరీ ధీమా ఏమిటో అతినికే అర్ధం కావాలి..!