తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ తండ్రికే ఓ డ్రైవ‌ర్ మోసం చేసిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. క‌డ‌ప జిల్లాలో మేడా మ‌ల్లికార్జున రెడ్డి టిడిపి రాజంపేట ఎంఎల్ఏ అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఎంఎల్ఏ  తండ్రి మేడా రామ‌కృష్ణారెడ్డి  టిటిడి ట్ర‌స్ట్ బోర్డు మెంబ‌ర్. తాత త‌న మ‌న‌వ‌డితో క‌లిసి బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుండి క‌డ‌ప‌కు బ‌య‌లుదేరారు. 


కారులో రూ. 50 ల‌క్ష‌లు


కారులో భారీ ఎత్తున అంటే రూ. 50 లక్ష‌లు ఉంది. కారు క‌ర్నూలుకు చేరుకోగానే భోజ‌నం కోసం ఓ హోట‌ల్ వ‌ద్ద కారును ఆపారు. తాత‌, మ‌న‌వ‌డితో పాటు డ్రైవ‌ర్ మ‌ల్లికార్జున‌రెడ్డి కూడా కారుదిగి హోట‌ల్లోకి వెళ్ళి భోజ‌నం చేశారు. ముగ్గురిలో ముందుగా భోజ‌నం చేసిన డ్రైవ‌ర్ హోట‌ల్లో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌ర్వాత తీరిగ్గా తాత‌, మ‌న‌వ‌డు కారు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు.


ఎంఎల్ఏకి టెన్ష‌న్


రోడ్డుమీద‌కు రాగానే ఇంకేముంది ?  కారు డ్రైవ‌ర్ ఎక్క‌డా  క‌న‌బ‌డ‌లేదు.   చుట్టుప‌క్క‌ల వెతికిన త‌ర్వాత వారిద్ద‌రికీ అర్ధ‌మైంది. డ్రైవ‌ర్ మాయం అయిపోయాడ‌ని. కారులోని డ‌బ్బుతో పాటు కారు తాళాల‌ను కూడా డ్రైవ‌ర్ తీసుకుని మాయమైపోయాడు. దాంతో ఒక్క‌సారిగా టెన్ష‌న్ మొద‌లైంది. వెంటనే ఎంఎల్ఏకి ఫోన్ చేసి విష‌యం చెప్పారు. త‌ర్వాత క‌ర్నూలోని పోలీసుస్టేష‌న్ కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగి హోట‌ల్ ముందున్న సిసి ఫుటేజిల‌ను ప‌రిశీలిస్తున్నారు. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి న‌మ్మ‌కంగా ఉన్న డ్రైవ‌ర్ ఇంతప‌ని చేస్తాడ‌ని వాళ్ళు అస్స‌లు ఊహిం చ‌నే లేదు. రామ‌కృష్ణారెడ్డి ఎంతైనా వెంక‌న్న పాల‌క‌మండ‌లి స‌భ్యుడు క‌దా ? ఆదుకోకుండానే ఉంటాడా ?


మరింత సమాచారం తెలుసుకోండి: