బీజేపీ పొత్తు గురించి ఎప్పుడు అడిగినా జగన్ చెప్పేది సమాధానం ఒకటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ తో నైనా కలిసి పోతామని అయితే ఇక్కడే జగన్ తప్పు చేస్తున్నాడని అందరు భావిస్తున్నారు ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఖరా ఖండిగా చెప్పింది బీజేపీ మరీ అలాంటప్పుడు 2019 లో బీజేపీ ఎలా ఇస్తుంది . ఇదే ప్రతి పక్షాలకు ఆయుధంగా దొరుకుతుంది.
తెలంగాణ ఉద్యమ సమయంలో 'గొంగలి పురుగునైనా ముద్దాడేందుకు సిద్ధం..' అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నినదించారు. అన్నట్టుగానే, పలు రాజకీయ పార్టీలతో ఆయన మంతనాలు జరిపారు. చివరికి టీడీపీతోనూ 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్తో కలిశారు, బీజేపీతో మంతనాలు జరిపారు.. చాలా చాలా చేశారు కేసీఆర్. కానీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 'ఈక్వేషన్' ఏమాత్రం కుదరడంలేదు.. ఇతర పార్టీలతో కలవడానికి.
కాంగ్రెస్, బీజేపీలకు వైఎస్సార్సీపీ 'సమ'దూరమని చెబుతోంది. టీడీపీతో వైఎస్సార్సీపీ కలిసే ప్రసక్తేలేదు. ఇటీవల పవన్కళ్యాణ్పై జగన్ విమర్శలు, ఆ తర్వాత పవన్, జగన్పై కౌంటర్ ఎటాక్.. వెరసి, ఆ ఈక్వేషన్ కూడా 'నెగెటివ్' అనే తేలిపోయింది. ప్రత్యేకహోదా ఇచ్చే పార్టీకే మద్దతిస్తామని వైఎస్సార్సీపీ అంటోంది. అయితే ఇప్పుడు అయినా 2019 లో అయినా ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ మాత్రం కనిపించడం లేదు.