గుంటూరు జిల్లాలో టిడిపి ఎంఎల్ఏ దూళిపాళ్ళ న‌రేంద్ర‌కు జ‌నాలు షాక్ ఇచ్చారు. సొంత నియోజ‌క‌వ‌ర్గం పొన్నూరులో ఓ వాటర్ ట్యాంకు నిర్మాణం   శంకుస్ధాప‌న‌కు హాజ‌రైన‌పుడు ఎంఎల్ఏపై స్ధానికులు తిర‌గ‌బ‌డ్డారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే ఎంఎల్ఏ శంకుస్ధాప‌న చేయ‌టానికి వ‌చ్చిన  ఎస్సీల‌కు కేటాయించింది.  ఇళ్ళ నిర్మాణం కోసం ఎస్సీల‌కు 2005లో ప్ర‌భుత్వం స్ధ‌లాలు కేటాయించింది.


వాట‌ర్ ట్యాంకు శంకుస్ధాప‌న‌


ఇన్ని సంవ‌త్స‌రాలుగా మ‌రి ఆ స్ధ‌లం ఎందుకు ఖాళీగా ఉందో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. హ‌టాత్తుగా ఈరోజు ఎంఎల్ఏ ఆ స్ధ‌లంలో వాటర్ ట్యాంకు నిర్మాణ‌మంటూ అధికార పార్టీ హ‌డావుడి మొద‌లుపెట్టింది. విష‌యం తెలుసుకున్న  స్ధానికులు అడ్డుకున్నారు.  త‌మ‌కు కేటాయించిన స్ధ‌లంలో వాట‌ర్ ట్యాంకు ఎలా నిర్మిస్తారంటూ ఎంఎల్ఏని నిల‌దీశారు. 


ప‌ట్టాలు ర‌ద్దు చేసిన‌ట్లు ఎందుకు చెప్పలేదు ?


అప్ప‌టి ప్ర‌భుత్వం ఇచ్చిన ఇంటి స్ధ‌లాలు న‌కిలీవ‌ని కాబ‌ట్టి త‌మ ప్ర‌భుత్వం ఆ ప‌ట్టాల‌ను ర‌ద్దు చేసింద‌ని  ఎంఎల్ఏ   దూళిపాళ్ళ చ‌ల్ల‌గా చెప్పారు. దాంతో స్ధానికులు మ‌రింత రెచ్చిపోయారు. గ‌త ప్ర‌భుత్వం త‌మ‌కిచ్చిన ఇంటి స్ధ‌లాల‌ను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌ట‌మేంటంటూ దుమ్ముదులిపేశారు. పోనీ ర‌ద్దు చేసిన విష‌యాన్ని త‌మ‌కెందుకు చెప్ప‌లేదని స్ధానికుల‌డిగిన ప్ర‌శ్న‌కు ఎంఎల్ఏ నోట మాట‌లేదు. అయితే, అక్క‌డే ఉన్న పోలీసులు క‌ల‌గజేసుకుని స్ధానికుల‌ను అక్క‌డి నుండి చెద‌ర‌గొట్టేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: