ఎన్నికలు వస్తున్న తరుణంలో కొన్ని ప్రముఖ మీడియా న్యూస్ చానల్స్ అతిగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రరాష్ట్రంలో ప్రముఖ న్యూస్ ఛానల్ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉండే ఛానల్ టీడీపీకి కాస్త వ్యతిరేకంగా ఉన్న నాయకుల రాజకీయ జీవితంపై బురదజల్లే విధంగా కార్యక్రమాలను ప్రసారం చేయడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆంధ్రరాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో చీరాల నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అయినా ఆమంచి కృష్ణమోహన్ ని టార్గెట్ చేసింది సదరు న్యూస్ ఛానల్. ఈ క్రమంలో ఆ  న్యూస్ ఛానల్ రాజకీయ నాయకులపై బురదజల్లే విధంగా నిర్వహించే  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే సదరు ఛానల్ రిపోర్టర్ ఆమంచి కృష్ణమోహన్ పై దురుసుగా..ముఖ్యంగా చీరాల ప్రజల దృష్టిలో రౌడీగా చిత్రీకరించే విధంగా ప్రశ్నలు వేశారు.
Image result for amanchi krishna mohan vs jaffar
ఈ క్రమంలో సదరు రిపోర్టర్ జాఫర్ అనే వ్యక్తి  అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నది ఉన్నట్టుగా మొహంమీద కెమెరాల ముందే తేల్చి చెప్పినట్లు జవాబులు ఇచ్చారు. అయితే గతంలో ఇటువంటి ప్రశ్నలే కొంతమంది రాజకీయ నాయకులపై జాఫర్  వేసిన సందర్భాలలో...చాలామంది రాజకీయ నాయకులు ఆ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. టీవీ 9 లో వచ్చే ముఖా ముఖి ప్రోగ్రాం చాలా ముఖ్యంగా రాజకీయ నాయకులని టార్గెట్ చేసే విధంగా ఉంటూ ఉంటుంది. టీడీపీ కి కాస్త వార్నింగ్ బెల్ లో ఉండే నాయకులనే వీరు టార్గెట్ చేస్తారు.
Image result for tv9 jaffar
టీడీపీ వీరాభిమానుల జోలికి అసలు రానే రారు. అయితే ఈ విషయంలో ఆమంచి కృష్ణమోహన్ హుందాగా సాదాసీదా రాజకీయ నాయకుడిగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు కూల్ గా  సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ పంచెన ఆయన చేరుతారు అంటూ జాఫర్ ఇన్ డైరెక్ట్ గా ఆమంచి ని బుక్ చేద్దాం అన్నట్టు ప్రవర్తించాడు. అసలు విషయం ఏంటంటే ఆమంచి కాపు కులస్థుడు ఆయన కులమే పవన్ కళ్యాణ్ ది కూడా సో ఈ ఒక్క కారణం చాలు వాళ్లకి అటు తిప్పి ఇటు తిప్పి పవన్ కళ్యాణ్ ని ఆమంచి ని ఒకే రొంపి లోకి దింపి జనాల మైండ్ లో పవన్ తో ఆమంచి ఉన్నారు అనీ టీడీపీ కి వ్యతిరేకి అనీ చూపించుకుని బురద జల్లడం కోసం ఇదంతా .. చీరాల లోకల్ జనాలు కూడా ఈ ప్రోమో కట్ చేసిన తీరు పట్ల విస్తు పోతున్నారు ..
Image may contain: 2 people, people standing
ప్రజా సమస్యల మీద ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా లేకుండా అడ్డవైన ప్రశ్నలూ వేసారు అనీ ఆమంచి ఏ పార్టీలో ఉంటారో, పవన్ తోనా టీడీపీ తోనా అనేది తమకి ఎన్నికల టైం లో కావాలి కానీ ఇప్పుడు నియోజికవర్గం లో ఉన్న సమస్యలు - వాటి పర్యవసానాలు గురించి అడగకుండా ఈ చెత్త ఏంటి అంటూ కోప్పడుతున్నారు వారంతా. సెన్సేషనల్ జర్నలిజం కోసం ఎగబడ్డం తప్ప జాఫర్ దగ్గర ఆ ప్రోగ్రాం ప్లానర్ ల దగ్గర విషయం లేదు అని పెదవి విరుస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: