ఎన్టీఆర్ కుమారుడు అయినా నంద మూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదం లో మరణించాడు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ వయస్సు 61 సంవత్సరాలు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషిగా, మొండితనం నిండిన వ్యక్తిత్వంతో ఆయన నందమూరి వారసుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు. హరికృష్ణ కుమారుడు జానకి రామ్ కొన్నేళ్ల క్రితం విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రమాదానికి గురై మరణించారు.
అప్పటి నుంచీ హరికృష్ణ తనయులు తమ సినిమాల్లో రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్తగా వుండాలని, తమ కుటుంబంలో జరిగిన విషాదం మరే కుటుంబంలో జరగకూడదని చెబుతూ వస్తున్నారు. కానీ దురదృష్టం మరోసారి ఆ కుటుంబాన్ని వెన్నాడినట్లు కనిపిస్తోంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? అన్నది ఇంకా క్లియర్ గా తెలియలేదు.