బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి మాట్లాడుతూ భోజనం చేస్తున్న ఫోటోలు లీక్ అయ్యాయి. నిజానికి ఎవరో వీటిని కావాలని తీసి వదిలినట్టుంది. హరికృష్ణ మరణించిన తరువాత నుంచి బాలయ్య బాబు, చంద్రబాబులు ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితంగా మారిపోయిన ఫొటోలు బయటకు వస్తూనే వున్నాయి. చంద్రబాబు తన ఇరుపక్కలా హరికృష్ణ పిల్లలను కూర్చోపెట్టుకోవడం, బాలయ్య ఎన్టీఆర్ కు దగ్గరలోనే కూర్చోడం, ఇలా అని ఫోటొలు వచ్చాయి. సరే, ఇవంటే, పబ్లిక్ గానే జరిగిన వ్యవహారాలు కనుక ఎవరో ఒకరు క్లిక్ చేసారు అని సరిపెట్టుకోవచ్చు.

ఒక మరణం.. ఒక కలయిక

కానీ నిన్నటికి నిన్న ఎన్టీఆర్-బాలయ్య బఫే భోజనాలు చేస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. పైగా ఈ టైమ్ లో బాలయ్య-ఎన్టీఆర్ ముచ్చటించుకున్నట్లు కూడా క్లియర్ గా వుంది. మొబైల్ లో రికార్డు చేసిన వీడియో ఇది. ఈ భోజనాలు నందమూరి ఫ్యామిలీ బంధువర్గం మధ్య జరిగిన చిన్న కర్మ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినవి. సాధారణంగా ఇలాంటివి చాలా  నిరాడంబరంగా, కామ్ గా జరుగుతాయి. వీడియోలు గట్రా తీసే వ్యవహారాలు వుండవు.

Image result for chandra babu

పైగా బాలయ్య-ఎన్టీఆర్ మాట్లాడుకుంటుంటే అక్కడే వుండి వీడియోలు ఎవరు తీస్తారు? పైగా ఎన్టీఆర్-బాలయ్య ఇద్దరిలో ఎవరైనా ఆగ్రహించే అవకాశం వుంది. ఈ వీడియో దొంగచాటుగా తీసింది కాదు. వేరే వాళ్లు వుండే అవకాశం లేదు. అంటే ఈ వీడియా కావాలనే తీసినట్లు, కావాలనే బయటకు వదిలినట్లు క్లియర్ అవుతోంది. అంటే ఎన్టీఆర్ తో  ఇప్పుడు బాలయ్యకు కానీ, చంద్రబాబుకు కానీ ఎక్కడా దూరంలేదని క్లియర్ చేయాలనే తహతహ ఈ రిలీజ్ లు అన్నింటి వెంటా కనిపిస్తోంది అనుకోవాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: