శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోండ్రు మురళీమోహన్ టీడీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. పార్టీ నాయకులతో కలసి ఆయన మీటింగు కూడా పెట్టుకున్నారు. మంచి ముహూర్తం చూసుకుని పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అంటున్నారు.


బాబు సమక్షంలో :


అమరావతిలో 6వ తేదీన సాయంత్రం 6.10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో మురళి   పార్టీ తీర్థం స్వీకరించనున్నారు. ఇక అమరావతికి పెద్ద ర్యాలీగా వెళ్ళేందుకు, మురళీ తో పాటు పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు కూడా సిద్ధమైపోతున్నారు.  ఇప్పటికే రాజాం నియోజకవర్గంలోని రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, రాజాం పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతారని తెలుస్తోంది.


ఆ వర్గం డుమ్మా :


మురళి టీడీపీలో చేరడం పార్టీలో ఓ వర్గానికి ఇష్టం లేదన్న టాక్ వినిపిస్తోంది. మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని పక్కన పెట్టేందుకు టీడీపీ పెద్ద నాయకులు నడిపిన మంత్రాంగంలో భాగంగా మురళి చేరుతున్నారు. అయితే ఎచ్చర్లలో తన పట్టును నిలుపుకుంటున్న ప్రతిభా భారతి వర్గం ఈ పరిణామాలతో గుస్సా అవుతున్నట్లు టాక్. మరి జిల్లా టీడీపీ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: