గత నాలుగు సంవత్సరాల భారతీయ జనతా పార్టీతో చట్టాపట్టాలేసుకున్న చంద్రబాబు ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నుండి టీడీపీ బయటకు వచ్చేసింది అని సంచలన కామెంట్ చేస్తూ...ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని బీజేపీ చాలా దారుణంగా మోసం చేసిందని పేర్కొన్నరు. ఈ క్రమంలో ఇట్టివల చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి లో నిర్వహించిన గ్రామదార్శిని కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ పై అలాగే బిజెపి నాయకుల పై షాకింగ్ కామెంట్స్ చేసారు.

Image result for chandrababu

అంతేకాకుండా వచ్చే ఎన్నికలల్లో బిజెపికి  ఒక్కసీటు కూడా రాదని అన్నారు. జగన్, పవన్ కళ్యాణ్ లను అడ్డుపెట్టుకుని బీజేపీ నాటకాలాడుతుందని దుయ్యబుట్టారు. కేంద్రం సహకరించకపోయినా నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్నిస్వసక్తితో అభివృద్ధి చేసుకున్నామన్నారు. మరోవైపు కేంద్రం ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.

Related image

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బుందేల్ ఖండ్ కు 24 వేల కోట్లు ఇస్తే మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేవలం 1000కోట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో రైల్వేజోన్ పై మీనమేషాలు లెక్కేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇంకా విభజనకు గురైన రాష్ట్రం విషయంలో అనేక విషయాలలో బిజెపి ఆంధ్ర ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిన బిజెపికి వచ్చే ఎన్నికలలో తెలుగు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

Related image

ఈ క్రమంలో చంద్రబాబు చేసిన కామెంట్లపై విపక్ష పార్టీ కి సంబంధించిన నాయకులు మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాలు బిజెపితో జత కట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఎన్నికల సమయంలో ఇటువంటి కామెంట్లు చేస్తే ఎవరూ నమ్మరని...రాబోయే ఎన్నికలలో మీరు అన్నట్టుగానే ప్రజలు బాగా బుద్ధి చెబుతారని అన్నారు...అంతేకాకుండా ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అని...2014లో ఆంధ్రరాష్ట్రంలో అబద్ధాలు చెప్పి తీసిన గోతిలో...2019లో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని పడగోడతారని చంద్రబాబు కి దిమ్మ తిరిగిపోయే విధంగా కౌంటర్ ఇచ్చారు.




మరింత సమాచారం తెలుసుకోండి: