తెలంగాణా సమాజానికి కాంగ్రెస్ కంటే పెద్ద విలన్ ఎవరూ లేరని టీయారెస్ అధ్యక్షుడు కేసీయార్ అటాక్ చేశారు. దరిద్రమంతా ఆ పార్టీదేనంటూ గుస్సా అయ్యారు. తెలంగాణా ప్రజలకు నాలుగేళ్ళుగా ఆ పీడను లేకుండా చేసిన ఘనత‌ తమ పార్టీదేనని అన్నారు. మరో మారు తామే గెలవబోవడం ద్వారా శాశ్వతంగా తెలంగాణాలో కాంగ్రెస్ లేకుండా చేస్తామని కేసీయార్ ధీమాగా  చెప్పారు.


తెచ్చుకున్న తెలంగాణా ఇది :


తెలంగాణాను తాము ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ తీరును కేసీయార్ తప్పు పట్టారు. ఇలాంటి చవకబారు ప్రచారం చేసుకోవడం ద్వారా మరింత పలుచన కావద్దని సూచించారు. . పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తమదని, ఆ ఘనత తెలంగాణా సమాజానికే దక్కుతుందని ఆయన అన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల ముందు తెలంగాణాను ప్రకటించడానికి కావడం అప్పటికే దేశమంతా ఆ పార్టీ లేకుండా పోవడమే తప్ప మరేం కాదని అన్నారు. 


నియంతల్లా వేధించారు :


దేశ మొదటి ప్రధాని నెహ్రూ మొదలుకుని ఇందిరాగాంధి వరకు అంతా కలసి తెలంగాణాను నియంతలా  వేధించుకుని తిన్నారని కేసీయార్ విరుచుకుపడ్డారు. వద్దు అంటున్నా వినకుండా అంధ్రా వాళ్ళతో తెలంగాణాను నెహ్రూ కలిపాడని, ఆ తరువాత ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమాలు ఎన్ని చేసినా కాల్చి చంపారే తప్ప ఇందిరా గాంధీ ఇవ్వలేదని గుర్తు చేశారు. 


కబ్జాల పాలన :


తెలంగాణాలో 2014 వరకు నడిచింది కబ్జాల, గూండాల పాలన అని కేసీయార్ సెటైర్లు వేశారు. బాంబుల పేలుళ్ళు, మత కలహాలు, గొడవలు, భూముల స్కాములు ఇదంతా కాంగ్రెస్ అందించిన పాలన కాదా అని కేసీయార్ నిలదీశారు. తాము వచ్చాకనే మార్పు అన్నది కనిపించిందని ఆయన అన్నారు. మొత్తానికి కేసీయార్ తన మాటల దాడితో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ను కార్నర్ చేసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: