చంద్ర బాబు కు ఒక బుద్ది మాత్రం అదే వాడుకొని వదిలేయడం ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.  వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు నాయుడుకు ఉన్న టాలెంట్‌ ఏమిటో అప్పుడెప్పుడో భూమా నాగిరెడ్డే చెప్పాడు. అన్నిమాటలు చెప్పిన భూమా నాగిరెడ్డి చివరకు చంద్రబాబు ఒత్తిడి భరించలేక, కేసుల వేధింపులకు తాళలేక మంత్రిపదవి హామీ కూడా లభించడంతో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పెట్టిన ఒత్తిడితో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు.

Image result for chandra babu

ఇక భూమా కోసం హెలికాఫ్టర్‌ అంబులెన్స్‌ అంటూ ఆయన మరణం సమయంలోనే తెలుగుదేశం వాళ్లు నానా రకాల రాజకీయం చేశారు. శవానికి ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తామన్నట్టుగా రచ్చచేశారు. అదంతా రాజకీయం. ఆ తర్వాత కూడా అది కొనసాగింది. అందులో భాగమే అఖిలప్రియకు మంత్రిపదవి. ఎలాగూ నంద్యాలకు బైపోల్‌ వస్తుందని తెలిసి అఖిలప్రియకు మంత్రిపదవిని ఇచ్చారు. ఉప ఎన్నికల సమయంలో భూమా పిల్లలందరినీ రోడ్డెక్కించి వాళ్లచేత కన్నీరు కార్పించి సానుభూతిని క్యాష్‌ చేసుకున్నారు.

Image result for bhooma bramha reddy

దానికితోడు నంద్యాల్లో గెలవడానికి ఏపీ టీడీపీ అంతా అక్కడ దిగబడి ప్రచారం చేసింది. ఎలాగోలా నెగ్గడం అయితే నెగ్గారు.  ఒక కుక్కను చంపాలంటే దానికి పిచ్చిది అని ముద్ర వేయడం అనేది సామెత. ఎవరికైనా రాజకీయంగా చెక్‌ పెట్టాలంటే వారిపై అవినీతి ముద్రను వేయడం చంద్రబాబుకు తెలిసిన రాజకీయం. ఇప్పుడు అదే జరుగుతోంది. భూమా బ్రహ్మం పెద్ద అవినీతి పరుడు అని, అతడికి ఎలాగూ మళ్లీ ఛాన్స్‌ రాదని అడ్డంగా దోచుకుంటున్నాడని.. అనుచరవర్గం భారీఎత్తున కబ్జాలూ గట్రా చేస్తోందని పచ్చమీడియా ఘోషిస్తోంది. డైరక్టుగా ఆయన పేరు పెట్టకుండా.. ఇన్‌ డైరెక్టుగా బ్రహ్మాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: