లోకేష్ ప్రతి సభలో అర్ధం పర్ధం ఆరోపణలు చేసి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటాడు. ఇప్పుడు కూడా మరో మారు అదే పని చేసాడు. వివరాల్లోకి వెళితే.. తన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఓ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ లో కూడా ముందుగా ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదని, ఒకటిరెండు నెలలు ముందగా ఎన్నికలొస్తాయని.. ఆలోగా మన పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దృష్ట్యా, ముందుగా వచ్చినా మనం సిద్ధంగా ఉండాలని చెప్పడం ఎవరికైనా సహజం.

మరోమారు బట్టబయలైన ‘పప్పు’ జ్ఞానం!

అయితే మంత్రి నారాలోకేష్ మాత్రం ఈ అంశాన్ని కూడా జగన్ ను దెప్పిపొడవడానికి వాడుకుంటున్నారు. వాడుకుంటే.. ఓకే. పనిలో పనిగా తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముందుకు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ సన్నద్ధత కోసం చెప్పినమాట. నిజానికి చంద్రబాబునాయుడు ప్రతిసారీ ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి’ అని చెబుతూ ఉంటారు. అంటే- చంద్రబాబు చెబితే అది హితోపదేశం, జగన్ చెబితే అది తప్పు అన్నట్టుగా లోకేష్ అభివర్ణిస్తున్నారు.

Image result for lokesh tdp

రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియని విషయాలు జగన్ కు తెలుస్తున్నాయని, భాజపా నాయకుల ద్వారా ఆయనకు హాట్ లైన్ లో తెలుస్తున్నాయేమోనని లోకేష్ ఎద్దేవా చేశారు. అయినా రాష్ట్రంలో ముందస్తు వచ్చేట్లయితే అది భాజపా నాయకులకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ కేంద్రంలోని భాజపా ముందస్తుకు వెళ్లేట్లయితే ఆ సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఏముంది? ఇలా మరోమారు లాజిక్ లేకుండా, మాట్లాడి తన పప్పు వైఖరిని చాటుకుంటున్నారని 

మరింత సమాచారం తెలుసుకోండి: